త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | బీఆర్ఎస్ నేతలవి పసలేని సవాళ్లు : టీపీసీసీ చీఫ్‌

Mahesh Kumar Goud | బీఆర్ఎస్ నేతలవి (BRS leaders) పసలేని సవాళ్లని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌కు, ప్ర‌స్తుత త‌మ కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.

D

Telangana | Published On Jul 21, 2026, 12.10 pm IST

Mahesh Kumar Goud | బీఆర్ఎస్ నేతలవి పసలేని సవాళ్లు : టీపీసీసీ చీఫ్‌
Advertisement

Mahesh Kumar Goud | ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌కు, ప్ర‌స్తుత త‌మ కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్ర‌క‌టించారు. ఎనీ టైం స‌వాలుకు సిద్ధ‌మేన‌ని స‌వాల్ విసిరారు. నిజామాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

బీఆర్ఎస్ నేతలవి (BRS leaders) పసలేని సవాళ్లని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. సవాళ్లు విసిరి తోక ముడిచార‌ని ఎద్దేవా చేశారు. లెక్క‌ల‌తో స‌హా 70 వేల ఉద్యోగాలు రికార్డులు ఉన్నాయ‌ని.. చిత్త శుద్ధితో అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. నిరుద్యోగుల ప్రాణాల‌తో చెల‌గాడం ఆడి బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కుటుంబ పాల‌న‌తో రాష్ట్రాన్ని అధోగ‌తిపాలు చేశార‌ని మండిప‌డ్డారు. ఆ పార్టీ హ‌యాంలో నీళ్లు, నిధుల దోపిడీ జ‌రిగింద‌ని ఆరోపించారు. రెండున్న‌రేళ్ల‌లోనే కాళేశ్వ‌రం బీట‌లు వారింద‌ని.. ఈ ప్రాజెక్టుతో కాంట్రాక్ట‌ర్ల జేబులు నింపార‌ని మండిప‌డ్డారు. నీటి విడుద‌ల నిపుణుల స‌ల‌హా సూచ‌న మేర‌కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు ఆదరించే స్థితిలో లేర‌న్నారు.

Also Read..

పేపర్ లీక్‌లతో ప్రమాదంలో యువత భవిష్యత్తు : విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పిల్ల‌ల్ని రెచ్చగొట్టొద్దు.. పేపర్ లీక్‌లను అరికట్టడం జాతీయ బాధ్యత.. నీట్ వివాదంపై ప్రధాని మోదీ

ఎంపీల కొనుగోళ్లపై పార్లమెంట్‌లో చర్చ జరపాలి.. స్పీకర్‌కు ఎంపీ చామల కిరణ్ వాయిదా తీర్మానం..

Advertisement
Advertisement