Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య
Siddaramaiah | కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య( Siddaramaiah )సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Siddaramaiah | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య( Siddaramaiah )సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయని, దీంతో పాటు వయసు కూడా పైబడి పోయిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు.
శనివారం మాండ్య జిల్లాలోని కేఆర్పేటలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సిద్ధరామయ్య ఇలా వ్యాఖ్యానించారు. నేడు రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. కాబట్టి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటాను. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను వరుణ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. కానీ ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నాను. గతంలో ఎన్నికల్లో పోటీ చేస్తే నియోజకవర్గ ప్రజలే నాకు డబ్బు ఖర్చుపెట్టి గెలిపించేవారు. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
ప్రస్తుతం నా వయసు 79 ఏళ్లు. కర్ణాటక ప్రభుత్వ పదవీకాలం మరో ఏడాదిన్నర సమయం మిగిలి ఉంది. ఆ సమయానికి నాకు 82 ఏళ్లు నిండుతాయి. ఇక ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. గతంలో మాదిరి ఉత్సాహంగా పని చేయడం కూడా సాధ్యం కాదు. 2028 నాటికి నా రాజకీయ జీవితానికి 50 ఏళ్లు నిండుతాయి. 1978లో తొలిసారిగా తాలుకా బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. నా జీవితంలో గెలుపోటములను చూశాను. అయితే నేను నమ్మిన సిద్ధాంతానికి విరుద్ధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. అది సంతృప్తినిస్తుంది. నేడు నిజాయితీ గల రాజకీయాలకు తావు లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఐదు దశాబ్దాలుగా కర్ణాటక ప్రజలు తమ కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా చూసుకున్నారు. ఆ రుణం ఎప్పటికీ తీరిపోనిది. అందుకే భవిష్యత్ కూడా ప్రజా సేవకే అంకితం చేయబడుతుందని సిద్ధరామయ్య ప్రకటించారు.
ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರ ಇಂದು ಕಲುಷಿತಗೊಂಡಿರುವುದರಿಂದ 2028ರ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ನಾನು ಸ್ಪರ್ಧಿಸುವುದಿಲ್ಲ. ಆದರೆ, ಸಕ್ರಿಯ ರಾಜಕಾರಣದಲ್ಲಿದ್ದು, ಜನರ ಕಷ್ಟ, ಸುಖಗಳಿಗೆ ಧ್ವನಿಯಾಗಿ ನಿಲ್ಲುತ್ತೇನೆ.
ಮತ್ತೊಮ್ಮೆ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧಿಸುವಂತೆ ವರುಣ ಕ್ಷೇತ್ರದ ಜನರು ಒತ್ತಾಯಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಆದರೆ ನಾನು ಇನ್ನು ಮುಂದೆ ಯಾವುದೇ… pic.twitter.com/v0S4tCQ30o
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2026
సంబంధిత వార్తలు

Srinivas Goud | కృష్ణా, భీమా నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు.. తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు : శ్రీనివాస్ గౌడ్
జులై 26, 2026

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
జులై 26, 2026

Union Cabinet | ఏపీ–కర్ణాటక ఆర్థిక కారిడార్కు కేంద్రం ఆమోదం.. రూ.4,294 కోట్లతో మౌలిక వసతుల విస్తరణ
జులై 24, 2026
తాజావార్తలు
- ●Ram Charan | రామ్చరణ్కు సర్జరీ - కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ - ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?
- ●VC Sajjanar | మాటలు నమ్మొద్దు.. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సైబర్ మోసాలు: వీసీ సజ్జనార్
- ●UP Viral Wedding | వింత వివాహం: విడిపోలేక ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. నెట్టింట హాట్ టాపిక్!
- ●ICC T20I Rankings | టీ20 ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానానికి భారత్..!
- ●Ramchander Rao | కార్గిల్ విజయ్ దివస్.. సైనికుల అసమాన పరాక్రమానికి ప్రతీక: ఎన్. రామచందర్ రావు
- ●Health Tax | జంక్ఫుడ్పై హెల్త్ ట్యాక్స్!

Ram Charan | రామ్చరణ్కు సర్జరీ - కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ - ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?

VC Sajjanar | మాటలు నమ్మొద్దు.. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సైబర్ మోసాలు: వీసీ సజ్జనార్

UP Viral Wedding | వింత వివాహం: విడిపోలేక ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. నెట్టింట హాట్ టాపిక్!

ICC T20I Rankings | టీ20 ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానానికి భారత్..!



