త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | ఎంపీల కొనుగోళ్లపై పార్లమెంట్‌లో చర్చ జరపాలి.. స్పీకర్‌కు ఎంపీ చామల కిరణ్ వాయిదా తీర్మానం..

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఎంపీల పార్టీ ఫిరాయింపుల అంశంపై పార్లమెంట్‌లో తక్షణ చర్చ నిర్వహించాలని కోరుతూ భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు వాయిదా తీర్మానం (Adjournment Motion) సమర్పించారు.

S

Telangana | Published On Jul 21, 2026, 11.45 am IST

Chamala Kiran Kumar Reddy | ఎంపీల కొనుగోళ్లపై పార్లమెంట్‌లో చర్చ జరపాలి.. స్పీకర్‌కు ఎంపీ చామల కిరణ్ వాయిదా తీర్మానం..
Advertisement

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఎంపీల పార్టీ ఫిరాయింపుల అంశంపై పార్లమెంట్‌లో తక్షణ చర్చ నిర్వహించాలని కోరుతూ భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు వాయిదా తీర్మానం (Adjournment Motion) సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం), ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీలను బీజేపీలోకి ఆకర్షిస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంద‌ని ఆరోపించారు. ఈ పరిణామాలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఒత్తిడి సాధనాలుగా ఉపయోగించి ప్రజాప్రతినిధులను బీజేపీలో చేర్చుకుంటుంద‌ని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement