త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha Kalvakuntla | హామీల అమ‌లు గురించి ప్ర‌శ్నిస్తే ర‌క్తం క‌ళ్ల‌జూస్తారా..? పోలీసుల తీరుపై క‌విత మండిపాటు

Kavitha Kalvakuntla | ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే చేతకాక ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని తెలంగాణ ర‌క్ష‌ణ సేన (Telangana Rakshana Sena) చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha Kalvakuntla) హెచ్చ‌రించారు. బోడుప్పల్ భూ పోరాట ప్రాంతాన్ని క‌విత ఇవాళ సంద‌ర్శించారు.

D

Telangana | Published On Jul 2, 2026, 12.42 pm IST

Kavitha Kalvakuntla | హామీల అమ‌లు గురించి ప్ర‌శ్నిస్తే ర‌క్తం క‌ళ్ల‌జూస్తారా..? పోలీసుల తీరుపై క‌విత మండిపాటు
Advertisement

Kavitha Kalvakuntla | బోడుప్ప‌ల్ (Boduppal)లో భూ పోరాటం చేస్తున్న తెలంగాణ ర‌క్ష‌ణ సేన (Telangana Rakshana Sena) చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha Kalvakuntla)తోపాటూ వంద‌లాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారంద‌రికీ బొల్లారం పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల తీరుపై క‌విత తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళ‌లు, ఉద్య‌మ‌కారుల‌పై పోలీసులు విచ‌క్ష‌ణార‌హితంగా లాఠీఛార్జ్ చేశార‌ని ఆరోపించారు. ఇది అన్యాయ‌మైన చ‌ర్య అని మండిప‌డ్డారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉద్య‌మ‌కారుల‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమ‌లు గురించి అడిగామ‌ని.. అంత‌కుమించి ఇత‌ర ఎలాంటి డిమాండ్లూ పెట్ట‌లేద‌ని చెప్పారు. ఇచ్చిన హామీల అమ‌లు గురించి ప్ర‌శ్నిస్తే లాఠీల‌తో కొట్టిస్తారా..? అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై క‌విత తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఉద్యమకారుల రక్తాన్ని కళ్లజూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

"ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే చేతకాక ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదు. ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి వారి సమస్యలు ఇప్పుడు కనిపించడం లేదా..? ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టం. ప్రజాక్షేత్రంలో మీ మోసాలను ఎండగడుతాం. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది" అని క‌విత స్ప‌ష్టం చేశారు.

Also Read..

అవినీతి చేయ‌కుంటే మ‌మ్మ‌ల్ని ఎందుకు ఆపుతున్నారు..? : హ‌రీశ్ రావు

సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తోంది..?

తెలుగు రాష్ట్రాల మీదుగా రూ.16,400కే అయోధ్య, కాశీ వంటి పుణ్య‌క్షేత్రాల యాత్ర‌.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్‌

Advertisement
Advertisement