త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్ప‌డింది : డీకే శివ‌కుమార్‌

DK Shivakumar | రామ‌మందిరం ఆల‌య విరాళాల్లో (Ram Temple Donation Row) భారీ అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌ను బీజేపీ నేత‌లు దోచుకున్నార‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) ఆరోపించారు.

D

National | Published On Jul 2, 2026, 1.35 pm IST

DK Shivakumar | రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్ప‌డింది : డీకే శివ‌కుమార్‌
Advertisement

DK Shivakumar | రామ‌మందిరం ఆల‌య విరాళాల్లో (Ram Temple Donation Row) భారీ అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌ను బీజేపీ నేత‌లు దోచుకున్నార‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) ఆరోపించారు. ఈ అక్ర‌మ సంపాద‌న ద్వారా క‌ర్ణాట‌క‌లోని కొంద‌రు వ్య‌క్తులు కూడా ల‌బ్ధి పొందార‌ని పేర్కొన్నారు. రాముడి పేరుతో బీజేపీ దోపిడీకి పాల్ప‌డిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

గురువారం మీడియాతో డీకే శివ‌కుమార్ మాట్లాడుతూ.. "రాముడి పేరుతో బీజేపీ భారీ దోపిడీకి పాల్పడింది. భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌ను ఆ పార్టీ నేత‌లు దోచుకున్నారు. కర్ణాటకకు చెందిన కొంద‌రు కూడా ఈ సొమ్మును అందుకున్నారు. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ చాలా నెమ్మ‌దిగా సాగుతోంది. ఆ రూ.200 కోట్లు ఎక్క‌డికెళ్లాయ‌నే దానిపై త‌క్ష‌ణ‌మే విచార‌ణ జ‌రిపించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. గ‌తంలో దేవాలయాల్లో 'చెప్పుల దొంగలున్నారు జాగ్రత్త' అని బోర్డులు పెట్టేవారని.. ఇప్పుడు 'హుండీ దొంగలున్నారు జాగ్రత్త' అనే బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ డీకే వ్యాఖ్యానించారు.

Also Read..

డెల్ నుంచి కొత్త ఏలియన్‌వేర్ 15 ల్యాప్‌టాప్‌.. కంటెంట్ క్రియేట‌ర్లు, గేమర్లకు బెస్ట్ ఫీచ‌ర్లు..

తెలుగు రాష్ట్రాల మీదుగా రూ.16,400కే అయోధ్య, కాశీ వంటి పుణ్య‌క్షేత్రాల యాత్ర‌.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్‌

హామీల అమ‌లు గురించి ప్ర‌శ్నిస్తే ర‌క్తం క‌ళ్ల‌జూస్తారా..? పోలీసుల తీరుపై క‌విత మండిపాటు

Advertisement
Advertisement