త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ప‌లువురు నేత‌ల‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌.. గ‌న్‌మెన్ల తొల‌గింపు

Telangana | తెలంగాణలో రాజకీయ నాయకులకు (political leaders) షాక్ ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం (Telangana government) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లువురు నేత‌ల భ‌ద్ర‌త‌ (security)ను కుదించింది.

D

Telangana | Published On Jul 2, 2026, 1.04 pm IST

Telangana | ప‌లువురు నేత‌ల‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌.. గ‌న్‌మెన్ల తొల‌గింపు
Advertisement

Telangana | తెలంగాణలో రాజకీయ నాయకులకు (political leaders) షాక్ ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం (Telangana government) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లువురు నేత‌ల భ‌ద్ర‌త‌ (security)ను కుదించింది. సుమారు 70 మందికిపైగా నేత‌ల గ‌న్‌మెన్ల‌ను తొల‌గించింది. న‌ల్గొండ మేయ‌ర్ భ‌ర్త బుర్రి శ్రీ‌నివాస్ రెడ్డికి ఉన్న 2+2 గన్‌మెన్లను పూర్తిగా తొల‌గించింది. నకిరేకల్ కాంగ్రెస్ నేత నేతి విద్యాసాగర్‌కు ఉన్న భద్రతను ర‌ద్దు చేసింది. నల్గొండకు చెందిన‌ బీజేపీ కీల‌క‌ నేతలు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డిల గన్‌మెన్లను కూడా తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, సదరు నేతలకు ఉన్న ముప్పు తీవ్రతను అంచనా వేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార‌ వర్గాలు వెల్లడించాయి.

Also Read..

హామీల అమ‌లు గురించి ప్ర‌శ్నిస్తే ర‌క్తం క‌ళ్ల‌జూస్తారా..? పోలీసుల తీరుపై క‌విత మండిపాటు

అవినీతి చేయ‌కుంటే మ‌మ్మ‌ల్ని ఎందుకు ఆపుతున్నారు..? : హ‌రీశ్ రావు

సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తోంది..?

Advertisement
Advertisement