BRS | రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
BRS | అమెరికా, ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితరాల అందుబాటుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలపై శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ (BRS) శాసన సభా పక్షం వాయిదా తీర్మానం (Adjournment Motion) ప్రతిపాదించింది.
BRS | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) ఆరో రోజు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితరాల అందుబాటుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలపై శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ (BRS) శాసన సభా పక్షం వాయిదా తీర్మానం (Adjournment Motion) ప్రతిపాదించింది.
పెట్రోల్ బంక్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ..
ఇరాన్ యుద్ధం భారత్లో లాక్డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. హైదరాబాద్ (Hyderabad)లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో ప్రజలు బంకుల (petrol pumps) వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. కొందరైతే ఏకంగా పెద్ద పెద్ద క్యాన్లకు పెట్రోల్ నింపుకుని వెళ్తున్నారు. అదే సమయంలో నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
మంగళవారం రాత్రి నుంచే నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఉదయం కూడా ఆఫీసులకు వెళ్లే వాళ్లు (employees) ఉదయం నుంచే పెట్రోల్ కోసం పరుగులు తీస్తున్నారు. మరోవైపు ఇంధనం దొరక్క నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటోలు కూడా బంద్ అయ్యాయి. ఫలితంగా ఉదయం ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి. అదే సమయంలో బస్సులు కూడా ఫుల్గా ఉండటంతో ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో సామాన్యులు మళ్లీ లాక్డౌన్ పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.
ట్రెండింగ్లో లాక్డౌన్
మరోవైపు ప్రస్తుతం సోషల్ మీడియాలో లాక్డౌన్ ఇండియా ట్రెండింగ్లో ఉంది. గూగుల్ సెర్చింగ్లో కూడా లాక్డౌన్ ఇన్ ఇండియా తొలి స్థానంలో నిలిచింది. లోక్సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగిస్తూ.. మనం కరోనా పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హింట్ ఇవ్వడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్వయంగా ప్రధాన మంత్రే పార్లమెంట్ సాక్షిగా ఇలా మాట్లాడటం ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. మళ్లీ లాక్డౌన్ తప్పదా అన్న భయాలు నెలకొంటున్నాయి.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

MP Vaddiraju | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : ఎంపీ వద్దిరాజు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



