Saayoni Ghosh | దీదీని ప్రధానిగా చూడాలనుకుంది.. కట్చేస్తే ఆ పార్టీలో భవిష్యత్తే లేదంటూ రెబల్ గ్రూప్లో చేరిన ఎంపీ
Saayoni Ghosh | మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా పేరున్న జాదవ్పూర్ లోక్సభ ఎంపీ (Trinamool MP) సాయోని ఘోష్ (Saayoni Ghosh) సైతం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెబల్ వర్గంలో చేరారు.
Saayoni Ghosh | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. పలువురు నేతలు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే సుమారు 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్సభ ఎంపీలు తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. పలువురు రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో దీదీకి అత్యంత విధేయురాలిగా పేరున్న జాదవ్పూర్ లోక్సభ ఎంపీ (Trinamool MP) సాయోని ఘోష్ (Saayoni Ghosh) సైతం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెబల్ వర్గంలో చేరారు.
రెబల్ వర్గానికి నేతృత్వం వహిస్తున్న కాకోలి ఘోష్ దస్తీదార్ను సాయోని సంప్రదించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. రెబల్ వర్గానికి తన మద్దతు తెలియజేస్తూ.. సంతకం కూడా చేసినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్లో తనకు రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన సాయోని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచార సమయంలో తనపై వచ్చిన విమర్శలు, దాడులు జరిగినప్పుడు పార్టీ నాయకత్వం నుంచి మద్దతు లభించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తులో మమతా బెనర్జీ ప్రధాని కావాలంటూ (Mamata Banerjee As Future PM) సాయోని బలంగా వాదించారు. అలాంటి నాయకురాలు ఇప్పుడు తిరుగుబాటు వర్గానికి మద్దతుగా సంతకం చేసి, ఢిల్లీలో మకాం వేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
Also Read..
కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశం
ఆ వివరాలు బయటపెట్టిన కోవర్ట్ ఎవరో ముందు తెలుసుకోండి.. కాంగ్రెస్పై బీఎల్ సంతోష్ ఫైర్
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు
- ●Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..
- ●Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!
- ●CM Revanth Reddy | 17న రూ. 1300 కోట్ల హ్యామ్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- ●TMC-Congress | కాంగ్రెస్లో టీఎంసీ విలీనం..? మమతా బెనర్జీకి కీలక ప్రతిపాదన చేసిన సోనియా గాంధీ

Uttam Kumar Reddy | 2027 వేసవి చివరి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు

Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..

Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!






