త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్ర‌ధాన్‌ను తొల‌గించారు : అఖిలేష్ యాద‌వ్‌

Akhilesh Yadav | పేప‌ర్ లీక్ అంశంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)ని కాపాడేందుకే ఎన్డీయే ప్ర‌భుత్వం ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను (Dharmendra Pradhan) తొల‌గించింద‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) వ్యాఖ్యానించారు.

D

National | Published On Jul 28, 2026, 5.13 pm IST

Akhilesh Yadav | మోదీని కాపాడేందుకే ప్ర‌ధాన్‌ను తొల‌గించారు : అఖిలేష్ యాద‌వ్‌
Advertisement

Akhilesh Yadav | పేప‌ర్ లీక్ అంశంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)ని కాపాడేందుకే ఎన్డీయే ప్ర‌భుత్వం ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను (Dharmendra Pradhan) తొల‌గించింద‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) వ్యాఖ్యానించారు. "ధర్మేంద్ర ప్రధాన్ నిన్న‌ పార్లమెంటుకు వచ్చినప్పుడు సభ బయట ఆయనకు ఘనస్వాగతం లభించింది. అక్క‌డే మీకు ప‌రిస్థితి అర్థ‌మై ఉంటుంది.. ఆయ‌న రాజీనామాతో ఎన్డీయే ప్ర‌భుత్వం ఎంత‌టి సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డిందో. ఒక 'ప్రధాన్‌'ను తొలగించి ప్ర‌ధాన మంత్రిని కాపాడుకున్నారు" అని అఖిలేష్ యాద‌వ్ వ్యాఖ్యానించారు.

విరాళాల దొంగ‌తంనే ఆప‌లేని వాళ్లు.. పేప‌ర్ లీక్‌ల‌ను ఎలా ఆపుతారు..?

యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా అఖిలేష్ యాద‌వ్ మాట్లాడారు. విద్యార్థుల నిరసనల కారణంగానే ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందన్నారు. జెన్‌జీ ఉద్య‌మం మోదీ స‌ర్కార్ మెడ‌లు వంచింద‌న్నారు. యువత‌ లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రామమందిర విరాళాల దొంగతనం అంశంపై కూడా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. విరాళాల దొంగ‌తంనే ఆప‌లేని వాళ్లు.. పేప‌ర్ లీక్‌ల‌ను ఎలా ఆపుతారు..? అంటూ ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల నిర‌స‌న‌ల‌ను అఖిలేష్ అభినందించారు.

Also Read..

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు పూల‌మాల‌ల‌తో స‌త్కార‌మా..? ఆయ‌నేమైనా పాకిస్థాన్‌పై యుద్ధం గెలిచొచ్చారా..? : గౌర‌వ్ గొగోయ్

యూపీఏ హ‌యాంలోనే పేప‌ర్ లీక్‌లు.. అప్పుడెందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్

ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ ? నిజ‌మేనా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

Advertisement
Advertisement