Congress | కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశం
Congress | కాంగ్రెస్ (Congress) పార్టీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జూన్ 11న కీలక సమావేశం జరగనుంది.
Congress | కాంగ్రెస్ (Congress) పార్టీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జూన్ 11న కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుత రాజకీయా పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈసీని కలిసిన నేతలు..
కాగా, జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 24 స్థానాలను ఎన్నిక జగరనుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ (Meenakshi Natarajan Nomination Rejected)కు గురైంది. ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33ఏను అభిషేక్ సింఘ్వీ ఉదహరించారు. కోర్టు ద్వారా అభియోగాలు నమోదై, రెండేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో మాత్రమే సమాచారం వెల్లడించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ విషయంలో కోర్టు ఎలాంటి అభియోగాలను నమోదు చేయలేదని, ఆమెకు కోర్టు ముందు హాజరు కావాలని మాత్రమే నోటీసులందాయని ఆయన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read..
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. బీజేపీ కుట్రనే : మహేశ్ కుమార్ గౌడ్
ఆ వివరాలు బయటపెట్టిన కోవర్ట్ ఎవరో ముందు తెలుసుకోండి.. కాంగ్రెస్పై బీఎల్ సంతోష్ ఫైర్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు
- ●Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..
- ●Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!
- ●CM Revanth Reddy | 17న రూ. 1300 కోట్ల హ్యామ్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- ●TMC-Congress | కాంగ్రెస్లో టీఎంసీ విలీనం..? మమతా బెనర్జీకి కీలక ప్రతిపాదన చేసిన సోనియా గాంధీ
- ●Meta And Reliance | మెటా-రిలయన్స్ భారీ ఏఐ డీల్.. జామ్నగర్లో 168 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు..

Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు

Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..

Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!

CM Revanth Reddy | 17న రూ. 1300 కోట్ల హ్యామ్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన





