త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aircraft Crash Land | బారామ‌తిలో కూలిన శిక్ష‌ణ విమానం.. గ‌తంలో అజిత్ ప‌వార్ మ‌ర‌ణించింది కూడా ఇక్క‌డే

Aircraft Crash Land | మ‌హారాష్ట్ర‌లోని పూణె జిల్లా బారామ‌తి (Baramati)లో మ‌రోసారి విమాన ప్ర‌మాదం చోటు చేసుకుంది. గోజుబావి గ్రామంలో శిక్ష‌ణ విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది.

D

National | Published On May 13, 2026, 12.40 pm IST

Aircraft Crash Land | బారామ‌తిలో కూలిన శిక్ష‌ణ విమానం.. గ‌తంలో అజిత్ ప‌వార్ మ‌ర‌ణించింది కూడా ఇక్క‌డే
Advertisement

Aircraft Crash Land | మ‌హారాష్ట్ర‌లోని పూణె జిల్లా బారామ‌తి (Baramati)లో మ‌రోసారి విమాన ప్ర‌మాదం చోటు చేసుకుంది. బారామతి సమీపంలోని గోజుబావి గ్రామంలో బుధ‌వారం ఉద‌యం ఓ ప్రైవేట్ సంస్థ‌కు చెందిన శిక్ష‌ణ విమానం కుప్ప‌కూలిపోయింది. ప్ర‌మాద స‌మ‌యంలో అందులో ఓ ట్రైనీ పైల‌ట్ మాత్ర‌మే ఉన్నారు. ఆయ‌న ప్ర‌మాదం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఉదయం 8:50 గంటలకు ఈ ప్ర‌మాదం జరిగినట్లు పుణె ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. విమానం క్రాష్ ల్యాండ్ అయిన‌ట్లు చెప్పారు (Trainer Aircraft Crash Lands).

విమానం త‌క్కువ ఎత్తులో ఎగురుతున్న స‌మ‌యంలో సాంకేతిక లోపం త‌లెత్తిన‌ట్లు స‌మాచారం. ల్యాండ్ అయ్యే క్ర‌మంలో విమానం విద్యుత్ స్తంభాన్ని బ‌లంగా ఢీ కొట్టి నేల‌కూలింది. ఈ విమానం 'రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ'కి (Redbird Flight Training Academy) చెందిన శిక్ష‌ణ విమానంగా అధికారులు గుర్తించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా, ఈ ఏడాది జ‌న‌వ‌రి చివ‌రిలో ఇదే గ్రామంలో విమానం కూలిన విష‌యం (Ajit Pawar Plane Accident) తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో మ‌హారాష్ట్ర డిప్యూటీ ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న‌తోపాటూ మ‌రో న‌లుగురు మృతి చెందారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన నెల‌ల వ్య‌వ‌ధిలోనే మ‌రో విమానం కూల‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Also Read..

బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన విజ‌య్ ప్ర‌భుత్వం

ప్ర‌ధాని బాట‌లోనే కేంద్ర మంత్రులు.. కాన్వాయ్ సైజు కుదించుకున్న‌ అమిత్ షా, జేపీ న‌డ్డా

సోనియా గాంధీకి అస్వ‌స్థ‌త‌.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

Advertisement
Advertisement