త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

తెలంగాణ అసెంబ్లీలో నూతన శకం మొదలైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా మీడియా అడ్వైజరీ కమిటీకి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రేవంత్ సర్కార్ రికార్డు సృష్టించింది.

J

Hyderabad | Published On Jul 6, 2026, 10.30 pm IST

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
Advertisement
  • తెలంగాణ అసెంబ్లీలో దేశంలోనే తొలిసారిగా మీడియా అడ్వైజరీ కమిటీకి (Media Advisory Committee) ప్రత్యేక ఆఫీస్ ఏర్పాటు
  • పార్లమెంట్‌లో కూడా లేని ఈ సదుపాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
  • స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం
  • కార్యాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర సభ్యులు

Telangana Assembly | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వేదికగా ఒక కొత్త శకానికి నాంది పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. దేశంలోనే తొలిసారిగా 'మీడియా అడ్వైజరీ కమిటీ' కోసం అసెంబ్లీలో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని (Special Office) ఇవాళ ఘనంగా ప్రారంభించారు.

పార్లమెంట్‌లోనూ లేని సదుపాయం..

దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్‌లో (Parliament) కూడా మీడియా అడ్వైజరీ కమిటీకి ఇలాంటి ప్రత్యేక వసతి లేదు. దేశంలోని మరే ఇతర అసెంబ్లీలోనూ ఈ తరహా ఆఫీస్ లేదు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆలోచనలకు అనుగుణంగా ఈ నూతన కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలతో అసెంబ్లీ, మండలి కార్యదర్శులు దగ్గరుండి మరీ ఈ ఆఫీస్ ఏర్పాటు పనులను పర్యవేక్షించడం విశేషం.

First in India Special Media Advisory Office Opens in Telangana Assembly

ఘనంగా ప్రారంభోత్సవం..

ఈ స్పెషల్ ఆఫీస్‌ను సోమవారం ఉదయం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

First in India Special Media Advisory Office Opens in Telangana Assembly

ప్రారంభోత్సవానికి ముందు.. మీడియా అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో-చైర్మన్ పరిపూర్ణ చారితో పాటు ఇతర కమిటీ సభ్యులు కార్యాలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా తీసుకున్న ఈ నిర్ణయంతో జర్నలిస్టులకు అసెంబ్లీ వ్యవహారాలను కవర్ చేయడంలో, సమన్వయం చేసుకోవడంలో మరింత సౌలభ్యం కలగనుంది.

Advertisement
Advertisement