త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Missing Cases | మిస్సింగ్‌ కేసుల్లో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.. సుప్రీంకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ‌

Missing Cases | ఎవ‌రైనా వ్య‌క్తి అదృశ్య‌మైన‌ట్లు (Missing Cases) స‌మాచారం అందిన వెంట‌నే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసింది. ప్రాథమిక విచారణ లేకుండానే మిస్సింగ్ కేసుల‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అన్ని రాష్ట్రాల‌ పోలీసులను ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

D

National | Published On Aug 11, 2026, 3.32 pm IST

Missing Cases | మిస్సింగ్‌ కేసుల్లో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.. సుప్రీంకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ‌
Advertisement

Missing Cases | ఎవ‌రైనా వ్య‌క్తి అదృశ్య‌మైన‌ట్లు (Missing Cases) స‌మాచారం అందిన వెంట‌నే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లోని 'వ్యక్తి' (Person) అనే పదాన్ని కేవలం చిన్న పిల్లలకే పరిమితం చేస్తూ కొన్ని రాష్ట్రాలు తప్పుగా అర్థం చేసుకోవడంపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ఆదేశాలు వ‌య‌సు, లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది.

కోర్టు ఇచ్చిన మునుపటి ఉత్తర్వుల్లోని "వ్యక్తి" (person) అనే పదాన్ని కొన్ని రాష్ట్రాలు కేవలం చిన్నారులకు మాత్రమే వర్తిస్తుందనే విధంగా భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇది కావాలని దురుద్దేశంతో లేవనెత్తిన సాకుగా అభివర్ణించింది. గతంలో ఇచ్చిన తమ ఉత్తర్వుల్లోని అంశాలు స్పష్టంగానే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ప‌ర్స‌న్ అనే ప‌దానికి వయసు, లింగంతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ అని అర్థ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. త‌మ ఆదేశాల‌ను పాటించని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌పై ధిక్కారణ చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చ‌రించింది. ప్రాథమిక విచారణ లేకుండానే మిస్సింగ్ కేసుల‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అన్ని రాష్ట్రాల‌ పోలీసులను ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

Also Read..

రూ. 200 కోట్ల ప్ర‌భుత్వ భూమి.. రూ. 7 కోట్లకే రేవంత్ రాసిచ్చాడు : కేటీఆర్

ఏస‌ర్ నుంచి అత్యంత చ‌వ‌క ధ‌ర‌కే ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ధ‌ర రూ.40వేలే..

ఓటీటీలోకి క్రిస్టోఫ‌ర్ నోల‌న్ హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ది ఒడిస్సీ - ట్విస్ట్ ఏంటంటే?

Advertisement
Advertisement