త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | అర్హుల ఓట్లు తొల‌గించారు! : కేటీఆర్

KTR | అర్హుల ఓట్లు తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది.. వారికి ఎలా న్యాయం చేయాల‌నే దానిపై న్యాయ‌ప‌రంగా, పార్టీప‌రంగా ఏం చేయాల‌నే దానిపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అర్హుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు మా పార్టీ పోరాటం చేస్తుంది అని ఆయన స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Aug 11, 2026, 3.03 pm IST

KTR | అర్హుల ఓట్లు తొల‌గించారు! : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : అర్హుల ఓట్లు తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది.. వారికి ఎలా న్యాయం చేయాల‌నే దానిపై న్యాయ‌ప‌రంగా, పార్టీప‌రంగా ఏం చేయాల‌నే దానిపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అర్హుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు మా పార్టీ పోరాటం చేస్తుంది అని ఆయన స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

స‌ర్ ప్ర‌క్రియ ప్రారంభం కాకముందు తెలంగాణ‌లో ఉన్న ఓట్లు 3 కోట్ల 39 ల‌క్ష‌లు. స‌ర్‌లో తెలంగాణలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నయి అనేది కొంత ఆందోళన కలిగించే ప‌రిణామంగా చూస్తున్నాం. ఒక 60 ల‌క్ష‌ల ఓట్లు గంద‌ర‌గోళంలో ఉన్నాయ‌ని అంటున్న‌రు. ప్ర‌స్తుతం స‌ర్ ప్ర‌క్రియ ముగిశాక‌ 2 కోట్ల ఓట్లు ఉన్నట్లు తేలింది. కొన్ని ఓట్లు పోయే అవ‌కాశం ఉంది.. కొన్ని త‌ప్పుల‌త‌డ‌క‌గా ఉన్నాయ‌ని ఎన్నిక‌ల సంఘం చెబుతున్నట్లు స‌మాచారం. ఆగ‌స్టు 15న ముసాయిదా ప్ర‌చురిస్తార‌ని చెబుతున్నారు. అర్హుల ఓట్లు కూడా కొన్ని పోయినట్టు అనిపిస్తుంది.. అర్హులకు అన్యాయం జరగకుండా న్యాయపరంగా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి అని జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి నిర్ణయం తీసుకుంటాం అని కేటీఆర్ తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement