త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | సుపరిపాలనకు అదే అసలైన పరీక్ష : ప్ర‌ధాని మోదీ

PM Modi | ప్రజలకు సేవ చేయడమే సుపరిపాలనకు (good governance) అసలైన పరీక్ష అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. ప్ర‌ధానిగా త‌న 12 ఏళ్ల పాల‌న‌పై మోదీ ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర ట్వీట్ పెట్టారు.

D

National | Published On Jun 10, 2026, 12.50 pm IST

PM Modi | సుపరిపాలనకు అదే అసలైన పరీక్ష : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవలు అందించిన భార‌త ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాని ఎక్స్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ పెట్టారు. ప్రజలకు సేవ చేయడమే సుపరిపాలనకు (good governance) అసలైన పరీక్ష అని పేర్కొన్నారు. "ప్రజలకు సేవ చేయడమే సుపరిపాలనకు అసలైన పరీక్ష. అంకితభావం, వినయం, కర్తవ్య దీక్షతో నిరంతరం పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు" అని ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్ అవుతోంది.

2014లో తొలిసారి మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి ఎలాంటి విరామం లేకుండా 4,399 రోజులు (నేటితో) ప్ర‌ధానిగా కొన‌సాగుతున్నారు. త‌ద్వారా దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పేరిట ఉన్న రికార్డును అధిగ‌మించి అత్యంత సుదీర్ఘ‌కాలం ప‌నిచేసిన ప్ర‌ధానిగా నిలిచారు. 1952లో స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ ఏడాది మే 13న ప్ర‌మాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు (మొత్తం 4,398 రోజులు) ఆ పదవిలో కొనసాగారు. నెహ్రూ రికార్డును ప్ర‌ధాని మోదీ నేడు అధిగ‌మించారు.

అంతేకాదు, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం ఏర్ప‌డి నేటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్రముఖులు ప్ర‌ధాని మోదీకి ప్ర‌త్యేకంగా గ్రీటింగ్స్ తెలియ‌జేస్తున్నారు. ప‌లువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఎంపీలు ప్ర‌ధానికి ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Also Read..

ఆ వ్యాఖ్య‌లు పార్టీ సిద్ధాంతాల‌కు వ్య‌తిరేకం.. రేవంత్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఫైర్‌

టీఎంసీకి మ‌రో షాక్‌.. మ‌రో ఎంపీ రాజీనామా

ప్ర‌ధాని మోదీ అరుదైన ఘ‌న‌త‌.. నెహ్రూ రికార్డు బ‌ద్ద‌లు.. ఎన్డీయే పాల‌న‌కు 12 ఏళ్లు

Advertisement
Advertisement