Delhi Police | ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు
Delhi Police | సీజేపీ ఆందోళనల (CJP Protests) సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అభ్యంతరకర, దూషణాత్మక పోస్టులు ప్రచురించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) చర్యలు చేపట్టారు.
Delhi Police | సీజేపీ ఆందోళనల (CJP Protests) సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అభ్యంతరకర, దూషణాత్మక పోస్టులు ప్రచురించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) చర్యలు చేపట్టారు. ఆయా సోషల్ మీడియా ఖాతాలతోపాటూ కొన్ని న్యూస్ పోర్టళ్లకు నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అవమానకరమైన, దురుద్దేశపూర్వకమైన, పరువునష్టం కలిగించేలా పెట్టిన కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్, మెటా వంటి సంస్థలకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించడంతో పాటు వాటిని అప్లోడ్ చేసిన ఖాతాల పూర్తి వివరాలను అందించాలని కోరారు.
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయనే ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ అంశంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసినట్లు తెలిపారు.
Also Read..
బ్లాక్సీలో ఉద్రిక్తత.. కార్గో నౌకలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు
పీవోకే నిరసనకారులు కూడా భారత్లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కొండగట్టు అంజన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ.. పాల్గొన్న మంత్రులు.. ఫొటోలు
సంబంధిత వార్తలు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
జులై 28, 2026

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
జులై 28, 2026

Cockroach Janta Party | “ఏ ఒక్కరినీ వదిలిపెట్టం”: అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!
జులై 28, 2026
తాజావార్తలు
- ●Gutha Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకు రావాలి.. ఎక్కడ స్థిరపడినా మాతృభూమిని మరవొద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి
- ●Apple Upgrade | అప్గ్రేడ్ లీజ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసిన యాపిల్.. ఇక ఐఫోన్ సహా అన్ని రకాల డివైస్లు అద్దెకు..
- ●Russia-Ukraine War | బ్లాక్సీలో ఉద్రిక్తత.. కార్గో నౌకలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు
- ●Paper Leak | ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్.. 30 మంది అభ్యర్థుల నుంచి 1.2 కోట్లు వసూలు చేసిన డాక్టర్..
- ●Khawaja Asif | పీవోకే నిరసనకారులు కూడా భారత్లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు లక్కీ చాన్స్..

Gutha Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకు రావాలి.. ఎక్కడ స్థిరపడినా మాతృభూమిని మరవొద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి

Apple Upgrade | అప్గ్రేడ్ లీజ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసిన యాపిల్.. ఇక ఐఫోన్ సహా అన్ని రకాల డివైస్లు అద్దెకు..

Russia-Ukraine War | బ్లాక్సీలో ఉద్రిక్తత.. కార్గో నౌకలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు

Paper Leak | ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్.. 30 మంది అభ్యర్థుల నుంచి 1.2 కోట్లు వసూలు చేసిన డాక్టర్..



