PM Modi | దేశ విమానయాన రంగంలో అసాధారణ పురోగతి.. 12 ఏళ్లలో 166 ఎయిర్పోర్టులు : ప్రధాని మోదీ
PM Modi | దేశ విమానయాన రంగం (Indias aviation sector) అసాధారణ పురోగతిని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలే ఉండేవని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్డీయే అదికారంలోకి వచ్చిన 12 ఏళ్లలోనే 166 విమానాశ్రయాలు వచ్చాయన్నారు.
PM Modi | దేశ విమానయాన రంగం (Indias aviation sector) అసాధారణ పురోగతిని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం (Bhogapuram)లో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Alluri Sitarama Raju International Airport) ప్రధాని ఇవాళ ప్రారంభించారు. సుమారు రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
తెలుగులో అందరికీ నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని... సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు అర్పించారు. ఏపీ అభివృద్ధిలో ఈరోజు కీలకమైన రోజుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్లో ఒక కీలకమైన రోజని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఓ రన్వేలా ఉపయోగపడుతుందని అన్నారు. ఇది ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు ఒక 'లాంచ్ప్యాడ్' అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలే ఉండేవని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలోనే దేశ విమానయాన రంగం అసాధారణ పురోగతిని సాధించిందని చెప్పారు. 166 విమానాశ్రయాలు వచ్చాయన్నారు. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంతీయ విమాన సర్వీసుల అనుసంధాన పథకం 'ఉడాన్' (UDAN) గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ పథకం వల్ల ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరగడమే కాకుండా.. విమాన ప్రయాణికుల సంఖ్యా పెరిగిందన్నారు. చిన్నచిన్న పట్టణ ప్రజలకు కూడా విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించినట్లు వివరించారు.
గతంలో దేశంలో ఏ ఎయిర్పోర్టు నిర్మించినా ఒక్కరి కుటుంబానికి చెందిన పేర్లే పెట్టేవారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ చరిత్రను ఎన్డీయే ప్రభుత్వం తిరగరాసిందన్నారు. అయోధ్య ఎయిర్పోర్టుకు వాల్మీకీ పేరు, పంజాబ్లో సంత్ రవిదాస్ పేరుతో ఎయిర్పోర్టు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి భోగాపురం కొత్త ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించారు.
Also Read..
థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి అఖిల్ అక్కినేని వంద కోట్ల బ్లాక్బస్టర్ మూవీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Abhijeet Dipke | రీల్లోనే క్షమిస్తారా.. కేసులను కూడా ఎత్తివేస్తారా..? ప్రధాని మోదీ వీడియోపై అభిజీత్ దిప్కే వ్యంగ్యాస్త్రాలు
ఆగస్టు 1, 2026

PM Modi | ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. నన్ను క్షమించండి అంటూ వీడియో రిలీజ్ చేసిన 15 ఏళ్ల బాలిక
ఆగస్టు 1, 2026

PM KISAN | ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరో ఐదేండ్లు పొడిగింపు..
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | E20 పెట్రోల్ పూర్తి సురక్షితం.. నిర్భయంగా పోయించుకోండి
- ●Minimum Balance | మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏమిటి.. ఏయే బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి..?
- ●TGBIE | ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం
- ●Abhijeet Dipke | రీల్లోనే క్షమిస్తారా.. కేసులను కూడా ఎత్తివేస్తారా..? ప్రధాని మోదీ వీడియోపై అభిజీత్ దిప్కే వ్యంగ్యాస్త్రాలు
- ●Komatireddy Venkat Reddy | పెద్ద సూరారంలో రూ.60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం.. మహిళలకు రూ.2.5 కోట్ల రుణాలు
- ●Hyderabad Zoo | హైదరాబాద్ జూపార్కులో అరుదైన 'కోడి'..! జీవితకాలం 20 ఏళ్లు..!!

Ramchandar Rao | E20 పెట్రోల్ పూర్తి సురక్షితం.. నిర్భయంగా పోయించుకోండి

Minimum Balance | మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏమిటి.. ఏయే బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి..?

TGBIE | ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం

Abhijeet Dipke | రీల్లోనే క్షమిస్తారా.. కేసులను కూడా ఎత్తివేస్తారా..? ప్రధాని మోదీ వీడియోపై అభిజీత్ దిప్కే వ్యంగ్యాస్త్రాలు



