త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijeet Dipke | రీల్‌లోనే క్ష‌మిస్తారా.. కేసుల‌ను కూడా ఎత్తివేస్తారా..? ప్ర‌ధాని మోదీ వీడియోపై అభిజీత్ దిప్కే వ్యంగ్యాస్త్రాలు

Abhijeet Dipke | ఢిల్లీలో జ‌రిగిన నిర‌స‌న‌ల సంద‌ర్భంగా త‌న‌ను దుర్భాస‌లాడిన విద్యార్థుల‌ను క్ష‌మిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) విడుద‌ల చేసిన సెల్ఫీ వీడియోపై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్పందించారు.

D

National | Published On Aug 1, 2026, 1.45 pm IST

Abhijeet Dipke | రీల్‌లోనే క్ష‌మిస్తారా.. కేసుల‌ను కూడా ఎత్తివేస్తారా..? ప్ర‌ధాని మోదీ వీడియోపై అభిజీత్ దిప్కే వ్యంగ్యాస్త్రాలు
Advertisement

Abhijeet Dipke | ఢిల్లీలో జ‌రిగిన నిర‌స‌న‌ల సంద‌ర్భంగా త‌న‌ను దుర్భాస‌లాడిన విద్యార్థుల‌ను క్ష‌మిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) విడుద‌ల చేసిన సెల్ఫీ వీడియోపై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్పందించారు. నిరసనకారులపై పెట్టిన కేసులను కూడా ప్రభుత్వం ఎత్తివేస్తుందా..? అంటూ ప్ర‌శ్నించారు.

'రీల్‌లో మాత్రమే క్షమిస్తారా..? లేక విద్యార్థులపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకుంటారా..?' అంటూ ఎద్దేవా చేశారు. అంత‌కు ముందు పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ నిరోధక చట్ట సవరణపై ప్రధాని చేసిన వీడియోపై కూడా దిప్కే వ్యంగ్యాస్త్రాలు సంధించిన విష‌యం తెలిసిందే. దేశ భవిష్యత్తు కంటే మీ చ‌ర్మ‌మే ప్రకాశవంతంగా మెరుస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.

వాళ్లు మ‌న పిల్ల‌లు.. వారిని క్ష‌మిస్తున్నా : ప్ర‌ధాని మోదీ

అంత‌కుముందు శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. నిర‌స‌న సంద‌ర్భంగా త‌న‌ను దూషించిన విద్యార్థుల‌ను క్ష‌మిస్తున్న‌ట్లు చెప్పారు. వారు మ‌న పిల్ల‌ల‌ని.. త‌ప్పులు చేయ‌డం స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు. వారిని శిక్షించ‌డం కంటే స‌రైన మార్గంలో న‌డిపించ‌డం స‌మాజం బాధ్య‌త అని పేర్కొన్నారు.

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఏం జ‌రిగిందో దేశం మొత్తం చూసింద‌న్నారు. కొంత‌మంది ఆక‌తాయిలు అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో దూషించార‌ని ప్రధాని వాపోయారు. వారి మాట‌లు త‌గ‌వ‌ని పేర్కొన్నారు. త‌న‌ని, త‌న దివంగ‌త త‌ల్లిని కూడా దూషించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాళ్లంతా దారి త‌ప్పార‌ని.. స‌రైన మార్గంలో పెట్టాల‌న్నారు. అవ‌మానాలు ఏ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌వ‌ని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. యువ‌త‌ను దేశ నిర్మాణంలో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. ఈ వీడియో సందేశం త‌ర్వాత కొన్ని గంట‌ల‌కే 15 ఏళ్ల బాలిక క్షమాపణ వీడియో బయటకు రావడం గ‌మ‌నార్హం.

Also Read..

ఐఆర్‌సీటీసీ గంగా గయా సంగం యాత్ర.. ఒకే టూర్‌లో గ‌య‌, అయోధ్య, కాశీ వంటి పుణ్య‌క్షేత్రాల సంద‌ర్శ‌న‌.. హైద‌రాబాద్ నుంచే స్టార్ట్‌

జ‌మ్ము క‌శ్మీర్‌లో వ‌ల‌స కార్మికులే ల‌క్ష్యంగా ఉగ్ర‌దాడి.. ఇద్ద‌రు మృతి

అంబులెన్స్‌లో తీసుకెళ్తుండ‌గా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ ఖాళీ.. ఊపిరాడ‌క తండ్రి ఒడిలోనే రోగి మృతి

Advertisement
Advertisement