త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఇరాన్ వార్ వేళ‌.. ఆర్థిక సలహా మండలి స‌భ్యుల‌తో ప్ర‌ధాని కీల‌క భేటీ

PM Modi | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌తల వేళ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) నేడు కీల‌క భేటీ నిర్వ‌హించారు. పీఎం-ఆర్థిక సలహా మండలి (Economic Advisory Council Meeting) సభ్యులతో స‌మావేశ‌మ‌య్యారు.

D

National | Published On Jun 6, 2026, 2.55 pm IST

PM Modi | ఇరాన్ వార్ వేళ‌.. ఆర్థిక సలహా మండలి స‌భ్యుల‌తో ప్ర‌ధాని కీల‌క భేటీ
Advertisement

PM Modi | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌తల వేళ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) నేడు కీల‌క భేటీ నిర్వ‌హించారు. పీఎం-ఆర్థిక సలహా మండలి (Economic Advisory Council Meeting) సభ్యులతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా యుద్ధం ముగింపుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మ‌న దేశంపై ప‌డుతున్న‌ యుద్ధ ప్రభావాన్ని తగ్గించే చర్యలపై చర్చించారు.

ఇరాన్ వార్ (Iran War) కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా అశాంతి నెల‌కొన్న ప్ర‌స్తుత త‌రుణంలో భార‌త‌దేశ ఆర్థిక వృద్ధిని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, వ్యూహాల‌పై సుదీర్ఘంగా చర్చించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. అంతేకాదు, ప్రజల జీవన ప్రమాణాలను సులభతరం చేయడం, అలాగే వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కోసం చేపట్టాల్సిన వివిధ సంస్కరణలపై కూడా చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Also Read..

సీజేఐకి చేదు అనుభ‌వం.. లండ‌న్ కాలేజీలో కాక్రోచ్ వ్యాఖ్య‌ల‌పై నిల‌దీత‌

సోష‌ల్ మీడియాలో పోస్టుల‌ను చెరిపేయ‌గ‌ల‌రేమో.. మ‌మ్మ‌ల్ని కాదు : సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్

కుక్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఢిల్లీ హోట‌ల్‌లో మంట‌లు.. వెలుగులోకి కీల‌క విష‌యాలు

Advertisement
Advertisement