Bhojshala-Kamal Maula | భోజ్శాల హిందువులదే.. పూజలు చేసుకోవచ్చు.. కోర్టు కీలక తీర్పు
Bhojshala-Kamal Maula | వివాదాస్పద భోజ్శాల-కమల్ మౌలా (Bhojshala-Kamal Maula) కాంప్లెక్స్ విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అది హిందూ దేవాలయం అని, సరస్వతీ దేవి (goddess Saraswati) క్షేత్రమని మధ్యప్రదేశ్ హైకోర్టు (MP High Court) ప్రకటించింది. అక్కడ హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది.
Bhojshala-Kamal Maula | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ధర్ (Dhar) జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్శాల-కమల్ మౌలా (Bhojshala-Kamal Maula) కాంప్లెక్స్ విషయంలో ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. అది హిందూ దేవాలయం అని, సరస్వతీ దేవి (goddess Saraswati) క్షేత్రమని మధ్యప్రదేశ్ హైకోర్టు (MP High Court) ప్రకటించింది. దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతూ అక్కడ హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది.
కాగా, భోజ్శాల ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇది దేవాలయం అని హిందూ సంఘాలు అంటుండగా, ఇది తమకే చెందినదని ముస్లిం సంఘాలు వాదిస్తున్నాయి. హిందూవులు వాగ్దేవి (సరస్వతి) దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీదుగా వ్యవహరిస్తుంటారు. ఈ వివాదం నేపథ్యంలో 2003లో ఈ ప్రదేశం హిందూ, ముస్లింలకు చెందినదని ఏఎస్ఐ (Archaeological Survey of India) తీర్పు చెప్పింది. అప్పటి నుంచి ఇక్కడ హిందువులు మంగళవారం పూజలు చేస్తే.. ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఇది తమకే చెందుతుందంటూ హిందువులు కోర్టును ఆశ్రయించాయి. ఇక్కడ నిరంతరం పూజలు చేసుకునే హక్కు కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
దీన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. వివాదాస్పద స్థలం మసీదుకు చెందిందని ముస్లిం వర్గాల తెలిపాయి. దీంతో ఈ భోజ్శాల కాంప్లెక్స్ వివాదం నెలకొంది. ఇక ఈ వివాదాన్ని తేల్చాలని ఏఎస్ఐని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో 2024లో 98 రోజులపాటు పురావస్తుశాఖ సర్వే నిర్వహించింది. 2024 జులై 15న ఇండోర్ కోర్టుకు నివేదిక సమర్పించింది. నివేదిక ఆధారంగా ఇది దేవాలయమే అని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అక్కడ సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవచ్చని ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఏఎస్ఐ నివేదిక, చారిత్రక సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read..
యూఏఈపై దాడులు ఆమోదయోగ్యం కాదు.. పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం : ప్రధాని మోదీ
వాతావరణ శాఖ చల్లటి కబురు.. మే 26 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
భారత్ కు వాణిజ్య లోటు షాక్.. ఏప్రిల్లో భారీగా పెరిగిన దిగుమతులు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






