PM Modi | యూఏఈపై దాడులు ఆమోదయోగ్యం కాదు.. పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం : ప్రధాని మోదీ
PM Modi | యూఏఈపై ఇరాన్ దాడులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రంగా ఖండించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఘర్షణల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోందన్నారు. సమస్యల పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ దౌత్య చర్చలకే ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు.
PM Modi | పశ్చిమాసియాలో (West Asia) శాంతిని నెలకొల్పేందుకు భారత్ సాధ్యమైనంత మేర అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ భీకర యుద్ధం నేపథ్యంలో ప్రధాని నేడు యూఏఈ (UAE) పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో (Abu Dhabi) ప్రధానికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్ (Sheikh Mohammed bin Zayed Al Nahyan) ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాధినేతలు సమావేశమయ్యారు.
యూఏఈపై ఇరాన్ దాడులను ఈ సందర్భంగా ప్రధాని తీవ్రంగా ఖండించారు. యూఏఈని లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితిని యూఏఈ ఎంతో సంయమనంతో ఎదుర్కొంటున్న తీరును ప్రశంసించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఘర్షణల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోందన్నారు. సమస్యల పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ దౌత్య చర్చలకే ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు.
అండగా ఉంటాం..
అదే సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా యూఏఈకి భారత్ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. యూఏఈలోని భారతీయుల రక్షణకు చర్యలు తీసుకున్నందుకు కూడా ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో అక్కడ నివసిస్తున్న భారతీయులను సొంత కుటుంబ సభ్యుల్లా ఆదుకున్నందుకు యూఏఈ ప్రభుత్వానికి మోదీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
పలు కీలక అంశాల్లో అవగాహన ఒప్పందం..
ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు కీలక అంశాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక, వ్యూహాత్మక రక్షణ సహకారంపై యూఏఈ, ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. పెట్రోలియం నిల్వలు, ఎల్పీజీ సరఫరా, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాధినేతల సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. యూఏఈ పర్యటన తర్వాత ప్రధాని.. నెదర్లాండ్స్, స్వీడెన్, నార్వే, ఇటలీ దేశాలకు వెళ్లనున్నారు.
ప్రధానికి అరుదైన గౌరవం
ఇక ఈ పర్యటన సందర్భంగా ప్రధానికి అరుదైన గౌరవం లభించింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి (airspace) ప్రవేశించగానే.. ఆ దేశానికి చెందిన ఎఫ్-16 విమానం ఎస్కార్ట్గా వచ్చింది. అబుదాబిలో మోదీ విమానం ల్యాండ్ అయ్యే వరకూ ఆ ఫైటర్ జెట్ ఎస్కార్ట్గా వ్యవహరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
వాతావరణ శాఖ చల్లటి కబురు.. మే 26 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
రాజీపడిన ప్రధాని.. అదానీ కోసమే అమెరికాతో ట్రేడ్ డీల్ : రాహుల్ గాంధీ
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






