FCRA Bill | జేపీసీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు
FCRA Bill | విదేశాల నుంచి వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, పారదర్శకతను పెంచడానికి తీసుకొచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు (FCRA Amendment Bill, 2026)పై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని వాయిస్ ఓట్ ద్వారా లోక్సభ ఆమోదించింది.
FCRA Bill | త్రినేత్ర.న్యూస్ : విదేశాల నుంచి వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, పారదర్శకతను పెంచడానికి తీసుకొచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు (FCRA Amendment Bill, 2026)పై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని వాయిస్ ఓట్ ద్వారా లోక్సభ ఆమోదించింది. మొత్తం 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారని స్పష్టం చేసింది. ఈ బిల్లుపై వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోపు జేపీసీ నివేదిక ఇవ్వనుందని వెల్లడించింది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత చట్టం మైనారిటీలను లక్ష్యంగా చేసుకునేలా ఉందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. ఈ బిల్లును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. "ప్రతిపాదిత ఎఫ్సీఆర్ఏ (FCRA) బిల్లును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు మైనారిటీలకు వ్యతిరేకం కాని ఏ బిల్లును తీసుకొచ్చిందో మాకు చెప్పాలి" అని డిమాండ్ చేశారు. అఖిలేష్ వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఈ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని, విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు, పారదర్శకతను పెంచడానికే ఈ సవరణలు తెచ్చామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజుజు ( Kiren Rijiju) గట్టి కౌంటర్ ఇచ్చారు. చట్టపరమైన కార్యాచరణ లేకుండా విదేశీ నిధులను దేశంలోకి అనుమతించలేమన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకునేలా ఎలాంటి నిబంధనలూ ఇందులో లేవని స్పష్టం చేశారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ఒక్క అంశాన్ని చూపాలని అఖిలేష్ యాదవ్కి సవాల్ విసిరారు. ఈ విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.
Also Read..
ఒకే ఫ్లాట్లో 37 కుక్కలను పెంచుతున్న యువతి.. స్థానికుల ఫిర్యాదుతో హైకోర్టు సీరియస్
నాగార్జునసాగర్ నిండేదాక పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయాలి.. రేవంత్కు అలా అడిగే దమ్ముందా?
సంబంధిత వార్తలు

Tribunals Reforms Bill | విపక్షాల నిరసనల మధ్యే.. ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్సభ ఆమోదం
ఆగస్టు 10, 2026

Parliament deadlock | విద్యార్థుల నిరసనలపై అమిత్ షా ప్రకటన చేస్తారు : ప్రభుత్వం
ఆగస్టు 10, 2026

Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదికగా మాటల యుద్ధం
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●UPI Payments | యూపీఐలో సగటున ఒక్కో లావాదేవీకి నిర్వహణ ఖర్చు అసలు ఎంతవుతుంది..?
- ●Harish Rao | ఉదయ్ నాగరాజు తెలంగాణలో ఉదయించి.. లండన్లో వెలుగుతుండు
- ●Gachibowli Dogs Rescue | ఒకే ఫ్లాట్లో 37 కుక్కలను పెంచుతున్న యువతి.. స్థానికుల ఫిర్యాదుతో హైకోర్టు సీరియస్
- ●Un Employees | మా కంటే అర్జంట్ పనేం ఉంటది సర్.. కోదండరాంను నిలదీసిన నిరుద్యోగులు
- ●Jagadeesh Reddy | నాగార్జునసాగర్ నిండేదాక పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయాలి.. రేవంత్కు అలా అడిగే దమ్ముందా?
- ●bans sale of gutka | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం

UPI Payments | యూపీఐలో సగటున ఒక్కో లావాదేవీకి నిర్వహణ ఖర్చు అసలు ఎంతవుతుంది..?

Harish Rao | ఉదయ్ నాగరాజు తెలంగాణలో ఉదయించి.. లండన్లో వెలుగుతుండు

Gachibowli Dogs Rescue | ఒకే ఫ్లాట్లో 37 కుక్కలను పెంచుతున్న యువతి.. స్థానికుల ఫిర్యాదుతో హైకోర్టు సీరియస్

Un Employees | మా కంటే అర్జంట్ పనేం ఉంటది సర్.. కోదండరాంను నిలదీసిన నిరుద్యోగులు



