Oxygen | అంబులెన్స్లో తీసుకెళ్తుండగా ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ.. ఊపిరాడక రోగి మృతి
Oxygen | మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) మాండ్లా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు.
Oxygen | త్రినేత్ర.న్యూస్: మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) మాండ్లా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడిని అంబులెన్స్లో (Ambulance) హాస్పిటల్కు తీసుకెళ్తుండగా, మార్గ మధ్యలో ఆక్సిజన్ (Oxygen) సిలిండర్ ఖాళీ అయింది. దీంతో ఊపిరాడక ఆ వ్యక్తి తల్లిదండ్రుల ఒడిలోనే మృతిచెందాడు.
మాండ్లా (Mandla) జిల్లాలోని సున్హేరా మల్ గ్రామానికి చెందిన 21 ఏండ్ల అజీత్ బరియా కిడ్నీ సంబంధిత (Kidney Patient) వ్యాధితో బాధపడుతున్నాడు. జూలై 27న అతని పరిస్థితి విషమించడంతో అతని తండ్రి 108 అంబులెన్స్కు (Govt Ambulance) ఫోన్ చేశారు. దీంతో గంట తర్వాత వచ్చిన అంబులెన్స్లో బమ్హాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ఈ క్రమంలో అతడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ అంబులెన్స్ సిబ్బంది అతనికి ఆక్సిజన్ పెట్టేందుకు నిరాకరించారు. అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు జిల్లా దవాఖానకు తరలించాలని సూచించారు. దీంతో అదే అంబులెన్స్లో ఆక్సిజన్ సహాయంతో హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది. దీంతో ఊపిరి ఆడక తల్లడిల్లిన ఆ యువకుడు తండ్రి ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
కాగా, అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని అతని తండ్రి అమన్ బరియా ఆరోపిస్తున్నారు. తాను ఫోన్ చేసిన గంట తర్వాత అంబులెన్స్ వచ్చిందని, అందులో తొలుత ఆక్సిజన్ పెట్టేందుకు సిబ్బంది నిరాకరించారన్నారు. వైద్యుల సూచనతో ఆక్సిజన్ అందించినప్పటికీ అది.. మండల కేంద్రం నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా దవాఖానకు వెళ్లకముందే అయిపోయిందని చెప్పారు. తన కుమారుడు తన ఒడిలోనే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Mandla,Madhya Pradesh - A 21-year-old kidney patient died in his parents’ arms after the oxygen supply allegedly ran out in a government 108 ambulance while he was being taken to hospital, sparking serious allegations of negligence against the emergency medical service, a… pic.twitter.com/5ia4c6m2rI
— NextMinute News (@nextminutenews7) July 31, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Farmers Protest | రైతుల నిరసనకు తలొగ్గిన ప్రభుత్వం.. ఆ పంట సేకరణ పరిమితిని 25% నుంచి 60%కి పెంపు
జులై 30, 2026

Hydrogen Train | దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. విశేషాలు ఇవే..
జులై 16, 2026

woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Manushi Chhillar | నేనూ పేపర్ లీక్ బాధితురాలినే.. విద్యార్థుల బాధ నాకు తెలుసు : బాలీవుడ్ నటి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వారాంతంలో ప్రతికూల సంకేతాలు..?
- ●PM Modi | ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. నన్ను క్షమించండి అంటూ వీడియో రిలీజ్ చేసిన 15 ఏళ్ల బాలిక
- ●ABB India | ఏబీబీ ఇండియా భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.90.. రికార్డ్ డేట్ ఎప్పుడంటే..
- ●IBPS Clerk | 11,403 పోస్టులతో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో 191 ఖాళీలు
- ●Ration | ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కోటా ఒకేసారి.. నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ

Manushi Chhillar | నేనూ పేపర్ లీక్ బాధితురాలినే.. విద్యార్థుల బాధ నాకు తెలుసు : బాలీవుడ్ నటి

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వారాంతంలో ప్రతికూల సంకేతాలు..?

PM Modi | ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. నన్ను క్షమించండి అంటూ వీడియో రిలీజ్ చేసిన 15 ఏళ్ల బాలిక

ABB India | ఏబీబీ ఇండియా భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.90.. రికార్డ్ డేట్ ఎప్పుడంటే..



