త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oxygen | అంబులెన్స్‌లో తీసుకెళ్తుండ‌గా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ ఖాళీ.. ఊపిరాడ‌క రోగి మృతి

Oxygen | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) మాండ్లా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది నిర్ల‌క్ష్యానికి ఓ యువ‌కుడు బ‌ల‌య్యాడు.

G

National | Published On Aug 1, 2026, 11.42 am IST

Oxygen | అంబులెన్స్‌లో తీసుకెళ్తుండ‌గా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ ఖాళీ.. ఊపిరాడ‌క రోగి మృతి
Advertisement

Oxygen | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) మాండ్లా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది నిర్ల‌క్ష్యానికి ఓ యువ‌కుడు బ‌ల‌య్యాడు. కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న యువ‌కుడిని అంబులెన్స్‌లో (Ambulance) హాస్పిట‌ల్‌కు తీసుకెళ్తుండ‌గా, మార్గ మ‌ధ్య‌లో ఆక్సిజ‌న్ (Oxygen) సిలిండ‌ర్ ఖాళీ అయింది. దీంతో ఊపిరాడ‌క ఆ వ్య‌క్తి త‌ల్లిదండ్రుల ఒడిలోనే మృతిచెందాడు.

మాండ్లా (Mandla) జిల్లాలోని సున్హేరా మ‌ల్ గ్రామానికి చెందిన 21 ఏండ్ల అజీత్ బ‌రియా కిడ్నీ సంబంధిత (Kidney Patient) వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. జూలై 27న అత‌ని ప‌రిస్థితి విష‌మించ‌డంతో అత‌ని తండ్రి 108 అంబులెన్స్‌కు (Govt Ambulance) ఫోన్ చేశారు. దీంతో గంట త‌ర్వాత వ‌చ్చిన అంబులెన్స్‌లో బ‌మ్హాలోని క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో అత‌డు శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ అంబులెన్స్ సిబ్బంది అత‌నికి ఆక్సిజ‌న్ పెట్టేందుకు నిరాక‌రించారు. అయితే క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ వైద్యులు జిల్లా ద‌వాఖాన‌కు త‌ర‌లించాల‌ని సూచించారు. దీంతో అదే అంబులెన్స్‌లో ఆక్సిజ‌న్ స‌హాయంతో హాస్పిట‌ల్‌కు తీసుకెళ్తున్నారు. మార్గ‌మ‌ధ్యలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ అయిపోయింది. దీంతో ఊపిరి ఆడ‌క త‌ల్ల‌డిల్లిన ఆ యువ‌కుడు తండ్రి ఒడిలోనే ప్రాణాలు వ‌దిలాడు. ఈ సంద‌ర్భంగా తీసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా క‌లెక్ట‌ర్ విచార‌ణ‌కు ఆదేశించారు.

కాగా, అంబులెన్స్ సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్లే త‌మ కుమారుడు చ‌నిపోయాడ‌ని అత‌ని తండ్రి అమ‌న్ బ‌రియా ఆరోపిస్తున్నారు. తాను ఫోన్ చేసిన గంట త‌ర్వాత అంబులెన్స్ వ‌చ్చింద‌ని, అందులో తొలుత ఆక్సిజ‌న్ పెట్టేందుకు సిబ్బంది నిరాక‌రించార‌న్నారు. వైద్యుల సూచ‌న‌తో ఆక్సిజ‌న్ అందించిన‌ప్ప‌టికీ అది.. మండ‌ల కేంద్రం నుంచి కేవ‌లం 3 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జిల్లా ద‌వాఖాన‌కు వెళ్లక‌ముందే అయిపోయింద‌ని చెప్పారు. త‌న కుమారుడు త‌న ఒడిలోనే చ‌నిపోయాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement