Digital Arrest Scam | సీబీఐ అధికారులమంటూ.. వ్యాపారి నుంచి రూ.15 కోట్లు కాజేసిన నేరగాళ్లు
Digital Arrest Scam | సీబీఐ అధికారులమని చెప్పి నేరగాళ్లు ఓ వ్యాపారవేత్తను డిజిటల్ అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి ఏకంగా కోట్ల రూపాయలు (Businessman Loses Over Rs 15 Cr) దోచుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
Digital Arrest Scam | దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు పదేపదే మోసపోతూనే ఉన్నారు. తాజాగా సీబీఐ అధికారులమని చెప్పి నేరగాళ్లు ఓ వ్యాపారవేత్తను డిజిటల్ అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి ఏకంగా కోట్ల రూపాయలు (Businessman Loses Over Rs 15 Cr) దోచుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావికి చెందిన 81 ఏళ్ల వృద్ధ వ్యాపారిని కొందరు డిజిటల్ అరెస్ట్ చేశారు. సీబీఐ అధికారులమని చెప్పి దాదాపు ఆరు వారాలుగా అతన్ని బెదిరిస్తూ వస్తున్నారు. తనపై అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చిందని అతన్ని భయపెట్టారు. రూ.25 లక్షల మనీలాండరింగ్కు పాల్పడ్డారని.. రూ.5 లక్షలు కమీషన్ తీసుకున్నట్లు ఫిర్యాదు అందిందంటూ అతన్ని నమ్మబలికారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించి.. వ్యాపారి బ్యాంక్ ఖాతా, ఇతర ఆర్థిక వివరాలను సేకరించారు.
విచారణ పేరుతో తన వద్ద ఉన్న డబ్బును పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాల్సిందిగా సూచించారు. విచారణ పూర్తయ్యాక ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. వారి మాటలను నమ్మిన బాధితుడు విడతల వారీగా డబ్బు బదిలీ చేశాడు. అలా బాధితుడి నుంచి నేరగాళ్లు దాదాపు రూ.15 కోట్లకుపైగానే కాజేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధిత వ్యాపారవేత్త.. స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల హెచ్చరికలు..
ఈ కేసును దర్యాప్తు చేసిన సైబర్, ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ (CEN) పోలీసు అధికారులు.. డబ్బు బదిలీ అయిన ఖాతాను గుర్తించి కేవలం రూ. 90 లక్షలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి బెళగావి పోలీస్ కమిషనర్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఏ ప్రభుత్వ అధికారి కూడా ఫోన్ ద్వారా విచారణ చేయరని పోలీసులు హెచ్చరించారు. తెలియని వ్యక్తులతో బ్యాంక్ లేదా వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ల పేరుతో వచ్చే కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మోసాలకు గురైన వారు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also Read..
రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి.. స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్వర్క్పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

IPL 2026 | సైబర్ మోసాలకు అడ్డాగా ఐపీఎల్ 2026.. టిక్కెట్ల పేరుతో బ్యాంకు ఖాతాలు ఖాళీ..
మే 14, 2026

CP Ramesh | సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం కీలకం : సీపీ రమేశ్
మే 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



