Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
Minister Ponnam | హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాల పరిష్కారంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రాష్ట్ర మంత్రి కొండా సురేఖను కలిశారు.
Minister Ponnam | హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాల పరిష్కారంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రాష్ట్ర మంత్రి కొండా సురేఖను కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మంత్రి కొండా సురేఖ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ఇరువురు మంత్రులు చర్చించారు.
ముఖ్యంగా దేవాదాయ, అటవీ శాఖల పరిధిలో ఉన్న అనుమతులు, పెండింగ్ ఫైళ్ల స్థితిగతులను మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగాలంటే ఆయా శాఖల నుంచి సకాలంలో అనుమతులు, నిర్ణయాలు రావాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సమగ్ర వినతిపత్రాన్ని మంత్రి సురేఖకు అందజేశారు.
మంత్రి పొన్నం విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కొండా సురేఖ, హుస్నాబాద్ అభివృద్ధికి తమ శాఖల నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రంలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి, నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు ఇస్తామని తెలిపారు. దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించిన అంశాలపై సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా చూస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ సమావేశంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి ప్రతిపాదనలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మంత్రుల స్థాయిలో జరిగిన చర్చలు ఆయా పనులకు వేగం తీసుకురానున్నాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!
- ●CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం
- ●CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్
- ●Hyderabad Police Vehicle Auction | పోలీసులు సీజ్ చేసిన 2,193 వాహనాల వేలం.. వాటిలో మీ బైక్ లేదా కారు ఉందా?

BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం

CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి





