త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Leader Burnt Alive | ఫార్చ్యూన‌ర్ కారును ట్ర‌క్కుల మ‌ధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత స‌జీవద‌హ‌నం

BJP Leader Burnt Alive | ఛ‌త్తీస్‌గ‌ఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ ఫార్చ్యూన‌ర్ కారును ట్ర‌క్కుల మ‌ధ్య ఇరికించి.. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘ‌ట‌న‌లో బీజేపీ నేత స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు (BJP Leader Burnt Alive).

D

National | Published On Jun 18, 2026, 4.02 pm IST

BJP Leader Burnt Alive | ఫార్చ్యూన‌ర్ కారును ట్ర‌క్కుల మ‌ధ్య ఇరికించి నిప్పు.. బీజేపీ నేత స‌జీవద‌హ‌నం
Advertisement

BJP Leader Burnt Alive | ఛ‌త్తీస్‌గ‌ఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కొరియా (Koriya) జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాల‌పై (sand mining) చాలా కాలంగా న‌డుస్తున్న వివాదం ముగ్గురు ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఓ ఫార్చ్యూన‌ర్ కారును ట్ర‌క్కుల మ‌ధ్య ఇరికించి.. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘ‌ట‌న‌లో బీజేపీ నేత స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు (BJP Leader Burnt Alive).

ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఆ ప్రాంతంలోని ఇసుక క్వారీ కాంట్రాక్ట్ బీజేపీ నేత‌, మాజీ పంచాయ‌తీ ప్రెసిడెంట్ భ‌ర‌త్ సింగ్ (Bharat Singh) కుటుంబానికి లభించింది. సోన్‌హట్, కైలాష్‌పూర్, తేలిముడ, బెలియా, ఛింగురా ప్రాంతాల్లో ఇసుక త‌వ్వ‌కాలు, ర‌వాణాపై వివాదం నెల‌కొంది. మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన అక్ర‌మ‌ వసూళ్లపై నియంత్రణ కోసం భరత్ సింగ్ వర్గానికి, మరో బీజేపీ నేత మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మ‌ధ్య‌ తీవ్రమైన ఘర్షణ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో త్రిపాఠి కుటుంబం ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో మంగ‌ళ‌వారం రాత్రి భ‌ర‌త్ సింగ్ వాహ‌నంపై దాడి చేసింది.

భ‌ర‌త్ సింగ్ ఫార్చ్యూన‌ర్ ఎస్‌యూవీ కారును ట్ర‌క్కుల మ‌ధ్య ఇరికించి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘోర ఉదంతం మంగళవారం అర్ధరాత్రి సోన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో భ‌ర‌త్ సింగ్‌తోపాటూ వీరేంద్ర సింగ్‌, నాగేంద్ర సింగ్ స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఇసుక క్వారీ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవ‌డానికి, రాజీ చ‌ర్చ‌ల కోసం భ‌ర‌త్ సింగ్ అక్క‌డికి వెళ్లిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. అయితే, ఓ ప‌థ‌కం ప్ర‌కారం భ‌ర‌త్ సింగ్‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఆరోపించారు. ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

బాధిత కుటుంబం ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠిల‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మొత్తం తొమ్మిది మంది నిందితుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. భారీగా పోలీసులు మోహ‌రించారు.

Also Read..

బంగారం ధర రూ.2.13 లక్షలకా? జేపీ మోర్గాన్ షాకింగ్ అంచనా!

ర‌ష్యాపై అతిపెద్ద దాడి.. వంద‌లాది డ్రోన్ల‌తో విరుచుకుప‌డ్డ ఉక్రెయిన్‌

స‌భ్య‌దేశం కాదు.. అయినా భార‌త్‌కు రెడ్ కార్పెట్ ప‌రుస్తున్న జీ7 దేశాలు.. న్యూఢిల్లీకి ఎందుకంత ప్రాధాన్యం..?

Advertisement
Advertisement