India In G7 | సభ్యదేశం కాదు.. అయినా భారత్కు రెడ్ కార్పెట్ పరుస్తున్న జీ7 దేశాలు.. న్యూఢిల్లీకి ఎందుకంత ప్రాధాన్యం..?
India In G7 | జీ-7లో భారత్ సభ్యదేశం కాదు. అయినా ఆయా దేశాలు న్యూఢిల్లీకి రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది. వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, భద్రతా సవాళ్లు, సరఫరా వ్యవస్థల వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే సమయంలో భారత్ను కూడా చర్చల్లో భాగస్వామి చేస్తున్నాయి. ఈ సదస్సుకు క్రమం తప్పకుండా ప్రత్యేక అతిథిగా భారత్ను ఆహ్వానిస్తుండటం.. న్యూ ఢిల్లీ అభిప్రాయానికి ఈ కూటమి దేశాలు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
India In G7 | ప్రస్తుతం అందరి చూపూ ఫ్రాన్స్ వైపుపడింది. అక్కడ జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తదితరులు హాజరయ్యారు. ఈ జీ-7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రక్షణ, పర్యావరణం వంటి కీలక అంశాలపై చర్చించడానికి ఏటా ఈ దేశాలు శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తాయి.
సభ్య దేశాలు కాకపోయినప్పటికీ అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉన్న ఇతర దేశాలను కూడా ఈ సమావేశాలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. అయితే, ఈ అతిథుల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉంటోంది. ఏటా నిర్వహించే జీ-7 సదస్సుకు భారత్ను ఆయా దేశాలు విస్మరించడం లేదు. వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, భద్రతా సవాళ్లు, సరఫరా వ్యవస్థల వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే సమయంలో భారత్ను కూడా చర్చల్లో భాగస్వామి చేస్తున్నాయి.
ప్రపంచంలో సంపన్న ఆర్థిక వ్యవస్థలుగా గుర్తింపు పొందిన ఆయా దేశాలు భారత్కు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాయన్నది ప్రధాన ప్రశ్న. అయితే, దీని వెనుక పెద్ద కారణమే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశ ఆర్థిక వృద్ధి, విదేశాంగ విధానం, గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) తరఫున బలమైన గొంతుకగా ఉండటమే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం పెరగడంతో జీ7 దేశాలు కూడా మనదేశ అభిప్రాయాన్ని విస్మరించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే క్రమం తప్పకుండా ప్రత్యేక అతిథిగా భారత్ను ఆహ్వానిస్తుండటం.. న్యూ ఢిల్లీ అభిప్రాయానికి ఈ కూటమి దేశాలు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
గ్లోబల్ సౌత్కు భారత్ గొంతుక
ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక, రాజకీయ నిర్ణయాలపై పశ్చిమ దేశాలదే పైచేయిగా ఉండేది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ సమస్యలు అంతర్జాతీయ వేదికలపై తగిన స్థాయిలో ప్రతిబింబించడం లేదని తరచూ భావించేవి. అయితే, ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆయా దేశాల తరఫున అత్యంత బలమైన గళాన్ని వినిపించే దేశాల్లో ఒకటిగా భారత్ అవతరించింది. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వారధిగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రపంచ స్థాయి విధానాలు విజయవంతం కావాలంటే భారత్ వంటి దేశాల సహకారం అవసరమని జీ7 దేశాలు భావిస్తున్నాయి.
భారీ ఆర్థిక వ్యవస్థ
140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలుస్తోంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగానికి లభిస్తున్న ఊతం (manufacturing push), సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతోంది. దీంతో సరఫరా వ్యవస్థలను విస్తరించాలనుకుంటున్న పలు దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా మారింది. ముఖ్యంగా అంతర్జాతీయ కంపెనీలు తమ సరఫరా గొలుసులను వైవిధ్యభరితం చేసుకోవాలని, నిర్దిష్ట దేశాలపైనే ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న తరుణంలో భారత్ కీలకమైన ఆర్థిక భాగస్వామిగా అవతరించింది. అందుకే జీ7 దేశాలు భారత్తో ఆర్థిక సహకారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక స్థానం
భారతదేశానికి పెరుగుతున్న ప్రాధాన్యత వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతం ఒకటి. ఈ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతుండటం జీ7 దేశాలను ఆందోళన కలిగిస్తోంది. అందుకే భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తున్నాయి. భౌగోళిక స్థానం, సైనిక సామర్థ్యం, ఆర్థిక బలం కారణంగా ఆసియాలో ‘పవర్ బ్యాలెన్స్’ను కాపాడగల దేశంగా భారత్ను చూస్తున్నాయి.
వాతావరణ లక్ష్యాల్లో కీలక పాత్ర
ప్రపంచం నిర్దేశించుకున్న వాతావరణ లక్ష్యాలు చాలావరకు భారతదేశ భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉన్నాయి. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, భారతదేశం ఎంచుకునే ఇంధన వనరుల విధానాలు ప్రపంచ ఉద్గారాలపై (global emissions) ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. న్యూ ఢిల్లీ తన పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని (renewable energy capacity) గణనీయంగా విస్తరించింది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోంది. జీ7 దేశాలు నిర్దేశించుకున్న వాతావరణ లక్ష్యాలను సాధించాలంటే భారత్లో కలిసి పనిచేయడం ఎంతో అవసరం. అందుకే కీలక చర్చల్లో భారత్కు ప్రత్యేక స్థానం లభిస్తోంది.
స్వతంత్ర విదేశాంగ విధానం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్కు ప్రత్యేక స్థానం ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు వంటి సమయాల్లో భారత్ తన స్వతంత్ర వైఖరిని అవలంబించింది. ఏ ఒక్క కూటమికీ పూర్తిగా అనుకూలంగా కాకుండా అన్ని దేశాలతోనూ సమానంగా సంబంధాలను కొనసాగించింది. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.
అతిథి కాదు.. అంతకుమించి
జీ7 సదస్సులో భారత్ కేవలం అతిథి దేశం హోదాకే పరిమితం కావడం లేదు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, అభివృద్ధి, సాంకేతికత వంటి అంశాలపై జరిగే చర్చల్లో మన దేశం తన ఆలోచనలు, పరిష్కారాలను ప్రంపంచం ముందు ఉంచుతోంది.
Also Read..
ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నెలాఖరు వరకు ఖాతాల్లో వడ్డీ జమ..
పేపర్లెస్గా మంత్రివర్గ సమావేశాలు.. డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం
వందేమాతరాన్ని పక్కన పెట్టిన విజయ్ ప్రభుత్వం.. తమిళ గేయంతో అసెంబ్లీ ప్రారంభం
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Om Prakash Rajbhar | 2047 వరకూ అఖిలేష్ సీఎం కాలేరు.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ●AI | డాక్టర్లను మించేసిన ఏఐ.. వైద్య రంగంలో కొత్త మైలురాయి..
- ●Shankar Son | హీరోగా ఎంట్రీ ఇస్తోన్న డైరెక్టర్ శంకర్ కొడుకు - సీక్రెట్గా డెబ్యూ మూవీ లాంఛ్ - హీరోయిన్ ఫిక్స్
- ●NEET | నీట్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
- ●RTC Free Journey | నీట్ యూజీ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
- ●Mumbai Heatwave 2026 | ముంబై కష్టాలు: రాత్రంతా వెర్సోవా బీచ్లోనే నిద్రపోతున్న జనం.. అసలు కారణమిదే!

Om Prakash Rajbhar | 2047 వరకూ అఖిలేష్ సీఎం కాలేరు.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

AI | డాక్టర్లను మించేసిన ఏఐ.. వైద్య రంగంలో కొత్త మైలురాయి..

Shankar Son | హీరోగా ఎంట్రీ ఇస్తోన్న డైరెక్టర్ శంకర్ కొడుకు - సీక్రెట్గా డెబ్యూ మూవీ లాంఛ్ - హీరోయిన్ ఫిక్స్

NEET | నీట్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..






