త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Badrinath Dham | బ‌ద్రీనాథ్‌లో విరాళాల స్వాహా.. ఉన్న‌త‌స్థాయి విచార‌ణ‌కు ఆదేశించిన ప్ర‌భుత్వం

Badrinath Dham | ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన బ‌ద్రీనాథ్ ధామ్‌ (Badrinath Dham)లో విరాళాల చోరీపై ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ సింగ్ ధామి ఉన్న‌త‌స్థాయి విచార‌ణ‌కు ఆదేశించారు.

D

National | Published On Jul 8, 2026, 3.38 pm IST

Badrinath Dham | బ‌ద్రీనాథ్‌లో విరాళాల స్వాహా.. ఉన్న‌త‌స్థాయి విచార‌ణ‌కు ఆదేశించిన ప్ర‌భుత్వం
Advertisement

Badrinath Dham | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన బ‌ద్రీనాథ్ ధామ్‌ (Badrinath Dham)లో ఆర్థిక అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్‌ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ ఆరోప‌ణ‌ల‌పై ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ సింగ్ ధామి ఉన్న‌త‌స్థాయి విచార‌ణ‌కు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేర‌కు ఆలయ విరాళాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు, అక్రమాలపై నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు స‌భ్యులతో ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది.

ఈ క‌మిటీ ఆల‌యంలో అక్రమాలపై దర్యాప్తు చేయడం సహా భవిష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా తీసుకురావాల్సిన చ‌ర్య‌ల‌పై బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ (BKTC)కి ప‌లు సూచ‌న‌లు చేయ‌నుంది. ఇదిలా ఉండ‌గా.. భ‌క్తులు స‌మ‌ర్పించుకున్న కానుక‌ల‌ను స్వాహా చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఓ ఉద్యోగిని టెంపుల్ క‌మిటీ ఇప్ప‌టికే స‌స్పెండ్ చేసింది. ప్రాథ‌మిక విచార‌ణ‌లో అక్రమాలకు పాల్పడినట్టు సాక్ష్యాధారాలు లభించడంతో ప్రమోద్‌ నౌట్యాల్‌ అనే ఉద్యోగిని సస్పెండ్ చేసిన‌ట్లు బీకేటీసీ ఛైర్మన్‌ హేమంత్‌ ద్వివేది తెలిపారు.

Also Read..

ప్రధాని మోదీకి 35 అంతర్జాతీయ పురస్కారాలు: ఏ దేశం నుంచి ఏ అవార్డు వచ్చిందంటే?

ప్ర‌జ‌ల‌కు సమాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌ధాని విదేశాల‌కు వెళ్తారు : ప్రియాంక్ ఖ‌ర్గే

"మీరు పారిపోవ‌చ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్‌కౌంట‌ర్‌లో ల‌ష్క‌రే టాప్ క‌మాండ‌ర్ హ‌తం

Advertisement
Advertisement