త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyank Kharge | ప్ర‌జ‌ల‌కు సమాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌ధాని విదేశాల‌కు వెళ్తారు : ప్రియాంక్ ఖ‌ర్గే

Priyank Kharge | రామ మందిరం విరాళాల దుర్వినియోగం (Ram Mandir Donation Row) ఆరోప‌ణ‌ల బాధ్య‌త‌ను బీజేపీనే తీసుకోవాల‌ని క‌ర్ణాట‌క మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే (Priyank Kharge) అన్నారు. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు ఎదురైనప్పుడల్లా ప్ర‌ధాని మోదీ (PM Modi) విదేశాల‌కు వెళ్తార‌ని ఎద్దేవా చేశారు.

D

National | Published On Jul 8, 2026, 3.19 pm IST

Priyank Kharge | ప్ర‌జ‌ల‌కు సమాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌ధాని విదేశాల‌కు వెళ్తారు : ప్రియాంక్ ఖ‌ర్గే
Advertisement

Priyank Kharge | రామ మందిరం విరాళాల దుర్వినియోగం (Ram Mandir Donation Row)పై క‌ర్ణాట‌క మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే (Priyank Kharge) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శంకుస్థాప‌న‌, ధ్వ‌జారోహ‌ణ‌, ప్రారంభోత్స‌వాల‌కు క్రెడిట్ తీసుకున్న బీజేపీ ప్ర‌భుత్వం.. చందా చోరీ ఆరోప‌ణ‌ల‌కు కూడా బాధ్య‌త వహించాల‌ని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జ‌ల‌కు సమాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌ధాని విదేశాల‌కు వెళ్లిపోతుంటార‌ని ఎద్దేవా చేశారు.

బెంగ‌ళూరులో విలేక‌రుల‌తో ప్రియాంక్ ఖ‌ర్గే మాట్లాడారు. "రామ‌మందిరం అంశంపై సుప్రీంకోర్టు తీర్పుకు బీజేపీ క్రెడిట్ తీసుకుంది. శంకుస్థాప‌న‌కు, ధ్వ‌జారోహ‌ణ‌కు, ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు కూడా క్రెడిట్ తీసుకుంది. మరి అలాంటప్పుడు ఈ చందా చోరీ (విరాళాల దొంగ‌త‌నం)కి కూడా వారే బాధ్య‌త వ‌హించాలి క‌దా..? బీజేపీకి దేశం ముఖ్యంకాదు.. విరాళాలే ముఖ్యం. చోరీకి గురైన డ‌బ్బు ఎక్క‌డికిపోయింది..? ఆల‌య ట్రస్టు ఎందుకు రాజీనామా చేసింది..? రాజీనామా చేసిన తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా..? ప్ర‌ధాని మోదీ మ‌రోసారి విదేశాల‌కు వెళ్లారు. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు ఎదురైనప్పుడల్లా ఆయన విదేశాలకు వెళ్తారు" అంటూ ప్రియాంక్ ఖ‌ర్గే తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు.

Also Read..

అందాల భామలు.. తగ్గేదేలే!

క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారుల‌కు షాక్‌.. రివార్డుల్లో కోత‌.. కార‌ణాలేంటి..?

జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..

Advertisement
Advertisement