త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | కేజ్రీవాల్ అవినీతిప‌రుడు కాదు.. కోర్టు తీర్పుపై మాజీ సీఎం భావోద్వేగం

Arvind Kejriwal | ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసు (Delhi Liquor Policy Case)లో కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేర‌కు భావోద్వేగంతో క‌న్నీరు పెట్టుకున్నారు.

D

National | Published On Feb 27, 2026, 12.34 pm IST

Arvind Kejriwal | కేజ్రీవాల్ అవినీతిప‌రుడు కాదు.. కోర్టు తీర్పుపై మాజీ సీఎం భావోద్వేగం
Advertisement

Arvind Kejriwal | ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) భారీ ఊర‌ట ల‌భించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఆయ‌న‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ స్పందించారు. ఈ మేర‌కు భావోద్వేగంతో క‌న్నీరు పెట్టుకున్నారు.

"లిక్కర్ కేసులో నిందితులు అంద‌రికీ కోర్టు విముక్తి క‌ల్పించింది. అంతిమంగా స‌త్య‌మే గెలుస్తుంద‌ని మేం ఎప్పుడూ చెబుతూ వ‌చ్చాం. ఇప్పుడు అదే జ‌రిగింది. భార‌తీయ న్యాయ వ్య‌వ‌స్థ‌పై మాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది. కేజ్రీవాల్ త‌ప్పు చేయ‌లేదు. మా పార్టీని నాశ‌నం చేసేందుకు ఈ కేసులో ఇరికించారు. మ‌ద్యం కుంభ‌కోణంలో అవినీతి అనేది పూర్తిగా క‌ల్పితం. ఆప్‌ని నాశ‌నం చేసేందుకు ఐదుగురు కీల‌క నేత‌లను జైల్లో పెట్టారు. భార‌త చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా సిట్టింగ్ ముఖ్య‌మంత్రిని ఆయ‌న ఇంటి నుంచి ఈడ్చుకెళ్లి జైల్లో వేశారు. సిసోడియాను దాదాపు రెండేళ్లు జైల్లో ఉంచారు. మాపై అనేక కుట్ర‌లు చేశారు. జైల్లో వేసి వేధించారు. కేజ్రీవాల్ అవినీతిప‌రుడంటూ వార్త‌ల్లో చూపించారు. కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు. నేను నిజాయితీతో ప‌నిచేశా. వాళ్లు నాపై త‌ప్పుడు కేసు పెట్టారు. అది నేడు రుజువైంది. కేజ్రీవాల్ నిజాయితీ ప‌రుడ‌ని, సిసోడియా నిజాయితీ ప‌రుడ‌ని కోర్టు తేల్చింది" అంటూ కేజ్రీవాల్ భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై కేజ్రీవాల్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. త‌న‌పై పెద్ద రాజ‌కీయ కుట్ర జ‌రిగింద‌న్నారు. అమిత్‌షా, మోదీ క‌లిసి ఈ కుట్ర‌ప‌న్నిన‌ట్లు ఆరోపించారు.

Also Read..

Liquor Policy Case | లిక్క‌ర్ కేసు.. కేజ్రీవాల్‌, సిసోడియా, క‌విత‌కు భారీ ఊర‌ట

Panneerselvam | అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు కీల‌క ప‌రిణామం.. డీఎంకేలో చేరిన ప‌న్నీర్ సెల్వం

Block Layoffs | ఏఐ దెబ్బకు భారీగా ఉద్యోగుల కోత.. 4వేల మందిని తొలగించనున్న జాక్‌ డోర్సీ బ్లాక్‌ కంపెనీ..!

Advertisement
Advertisement