త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sikkim | సిక్కింలో విప‌రీతంగా మంచు.. చిక్కుకుపోయిన 2,700 మంది ప‌ర్యాట‌కులు

Sikkim | సిక్కిం (Sikkim)లో విప‌రీతంగా మంచు (Snow) ప‌డుతోంది. దీంతో ప‌ర్యాట‌కులు (Tourists) ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయారు. సుమారు 2,736 మంది ప‌ర్యాట‌కుల‌ను అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

D

National | Published On Feb 25, 2026, 10.58 am IST

Sikkim | సిక్కింలో విప‌రీతంగా మంచు.. చిక్కుకుపోయిన 2,700 మంది ప‌ర్యాట‌కులు
Advertisement

Sikkim | సిక్కిం (Sikkim)లో అతిశీత‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది. అక్క‌డ విప‌రీతంగా మంచు (Snow) ప‌డుతోంది. ఈ మంచు కార‌ణంగా జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. రాక‌పోక‌లు కూడా నిలిచిపోయాయి. దీంతో ప‌ర్యాట‌కులు (Tourists) ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయారు. పెరాథాంగ్ ఎగువ ప్రాంతాలు, సోమ్గో స‌ర‌స్సు (Tsomgo Lake) ప‌రిస‌రాల్లో మంగ‌ళ‌వారం భారీ హిమ‌పాతం కురిసింది. ఈ కార‌ణంగా 15వ మైలు, సోమ్గో మ‌ధ్య పెద్ద సంఖ్య‌లో ప‌ర్యాట‌క వాహ‌నాలు నిలిచిపోయాయి.

భారీ హిమ‌పాతం కార‌ణంగా రోడ్లు బ్లాక్ అయ్యాయ‌ని.. ఫ‌లితంగా సుమారు 2,736 మంది ప‌ర్యాట‌కుల‌తో ఉన్న మొత్తం 541 వాహ‌నాలు అక్క‌డ నిలిచిపోయిన‌ట్లు సిక్కిం ప‌ర్యాట‌క శాఖ అధికారులు తెలిపారు. ఎస్‌హెచ్‌వో, చెక్‌పోస్టు అధికారులు, టూరిజం ప‌ర్మిట్ సెల్ అధికారులు స‌హా ప‌లు శాఖ అధికారుల ఆధ్వ‌ర్యంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో మంచు ప‌రిస్థితుల్లో చిక్కుకుపోయిన ప‌ర్యాట‌కులంద‌రినీ సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్లు పేర్కొంది.

Also Read..

Shashi Tharoor | 'కేరళం'తో ఒరిగేదేంటి..? ప్రాజెక్టులు ముఖ్యం.. కేంద్ర ప్ర‌భుత్వంపై శ‌శి థ‌రూర్ ఫైర్‌

JEE Main 2026 Session 2 | ద‌ర‌ఖాస్తు చేశారా?.. నేటితో ముగియ‌నున్న‌ జేఈఈ మెయిన్ సెష‌న్ 2 రిజిస్ట్రేష‌న్లు

Stress | స్మోకింగ్‌, డ్రింకింగే కాదు.. దీన్ని కూడా వ‌దిలించుకోవాలి.. వైద్యుల సూచ‌న‌..

Advertisement
Advertisement