త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ఇన్‌స్టాలో మైన‌ర్ బాలిక‌లే టార్గెట్‌.. ప్రేమ పేరుతో ఐదుగురు యువ‌తుల‌తో వ్య‌వ‌హారం..

Hyderabad | ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిపి.. మరో యువతని మోసం చేయాలని చూసిన యువకుడు పోలీసుల‌కు చిక్కాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్న అత‌డు చివ‌రికి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్టు ఆధారంగానే ప‌ట్టుబ‌డ్డాడు.

G

Hyderabad | Published On Jul 26, 2026, 12.02 pm IST

Hyderabad | ఇన్‌స్టాలో మైన‌ర్ బాలిక‌లే టార్గెట్‌.. ప్రేమ పేరుతో ఐదుగురు యువ‌తుల‌తో వ్య‌వ‌హారం..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిపి.. మరో యువతని మోసం చేయాలని చూసిన యువకుడు పోలీసుల‌కు చిక్కాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్న అత‌డు చివ‌రికి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్టు ఆధారంగానే బంజారాహిల్స్ (Hyderabad) పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

ప‌వ‌న్ అలియాస్ త‌రుణ్ అనే యువ‌కుడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మైన‌ర్ బాలిక‌ను ప‌రిచ‌యం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో న‌మ్మించి ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ఆ బాలిక.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో అత‌నిపై పోక్సో కేసు (POCSO Case) న‌మోదుచేశారు. ఆ కేసులో గ‌త‌ మూడు నెల‌లుగా త‌ప్పించుకు తిరుగుతున్న అత‌డిని స్నేహితుని ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఆధారంగా బంజారాహిల్స్ (Banjarahills) ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

ఐదుగురు యువతులతో ఒకేసారి ప్రేమ వ్యవహారాలు కొనసాగించినట్లు తేలింది. మరో యువతిని ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు సమాచారం. నిందితుడిపై గ‌తంలో చోరీలు, స్నాచింగ్ కేసులు ఉన్న‌ట్లు తెలిపారు. గత ఆరు నెలల్లోనే అత‌నిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు తేలింది.

Advertisement
Advertisement