త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khawaja Asif | పీవోకే నిర‌స‌న‌కారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ ర‌క్ష‌ణ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Khawaja Asif | ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పీవోకే నిర‌స‌న‌కారుల‌ను భారత్‌తో స‌మానంగా శ‌త్రువులుగా చూస్తామంటూ ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ (Khawaja Asif) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

D

International | Published On Jul 29, 2026, 11.20 am IST

Khawaja Asif | పీవోకే నిర‌స‌న‌కారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ ర‌క్ష‌ణ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Khawaja Asif | పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (PoK)లో నిర‌స‌న‌లు కొన‌సాగుతున్న‌ వేళ ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ (Khawaja Asif) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పీవోకే నిర‌స‌న‌కారుల‌ను భారత్‌తో స‌మానంగా శ‌త్రువులుగా చూస్తామంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఓ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడిన ఆసిఫ్.. ఆందోళ‌న‌కారుల‌పై కాల్పులు జ‌ర‌ప‌డాన్ని గట్టిగా సమర్థించారు. పీఓకేలో నిరసన తెలుపుతున్నవారికి, భారతదేశానికి మధ్య ఎలాంటి తేడా లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆందోళ‌న చేస్తున్న వారితో ఎలాంటి చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. వారిని పాకిస్థాన్ శ‌త్రువులుగా అభివ‌ర్ణించారు.

పాక్‌ ఆక్రమిత్‌ కశ్మీర్‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ సోమ‌వారం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఇది మ‌రో 10 రోజుల వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో 45 స్థానాలకు గాను 12 స్థానాలను పాక్‌‌లో నివసిస్తున్న కశ్మీర్‌ శరణార్థులకు రిజర్వ్ చేయడాన్ని జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (Joint Awami Action Committee) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వతంత్ర ప్రతిపత్తిని అణచివేసేందుకు పాక్ కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌లను తీసుకొచ్చిందని జేఏఏసీ ఆరోపిస్తోంది. పీవోకేను తన నియంత్రణలో పెట్టుకునేందుకు పాక్ అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని మండిప‌డుతోంది. పాక్ పాల‌కుల నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా జేఏఏసీ జూన్ 5 నుంచి పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తోంది. ఈ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా నిర‌స‌న‌కారుల‌పై పాక్ బ‌ల‌గాలు కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ 100 మంది వ‌ర‌కూ కార్య‌క‌ర్త‌లు, అమాయ‌క ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డిస్తోంది.

Also Read..

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల‌కు ల‌క్కీ చాన్స్‌..

ఉప్పొంగుతున్న బొగత జలపాతం.. ప‌ర్యాట‌కుల‌ సందర్శన నిలిపివేత

700 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ..

Advertisement
Advertisement