త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | 700 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ..

Stock Markets | దేశీయ‌ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బలమైన రీబౌండ్ నమోదు చేశాయి. వాల్ స్ట్రీట్‌లో సానుకూల సంకేతాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) షేర్లలో ర్యాలీ ప్రభావంతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా ఎగిసిపడగా, నిఫ్టీ మళ్లీ 24,200 మార్క్‌ను అధిగమించింది. లార్జ్‌క్యాప్ షేర్లలో విస్తృత కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతు ఇచ్చాయి.

S

Business | Published On Jul 29, 2026, 10.30 am IST

Stock Markets | 700 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ..
Advertisement

Stock Markets | దేశీయ‌ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బలమైన రీబౌండ్ నమోదు చేశాయి. వాల్ స్ట్రీట్‌లో సానుకూల సంకేతాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) షేర్లలో ర్యాలీ ప్రభావంతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా ఎగిసిపడగా, నిఫ్టీ మళ్లీ 24,200 మార్క్‌ను అధిగమించింది. లార్జ్‌క్యాప్ షేర్లలో విస్తృత కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతు ఇచ్చాయి. అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా పెరుగుతున్న ముడి చమురు ధరలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 769.69 పాయింట్లు (1 శాతం) లాభంతో 77,535.61 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 50 సూచీ 217.25 పాయింట్లు (0.91 శాతం) పెరిగి 24,202.60 వద్ద కొనసాగింది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ గరిష్టంగా 795 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ ఇంట్రాడే గరిష్ట స్థాయిలో 231 పాయింట్లు లాభపడింది.

భారీగా ఎగ‌బాకిన ఐటీ షేర్లు..

విస్తృత మార్కెట్లలో కూడా కొనుగోళ్ల జోరు కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు దాదాపు 0.6 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు మార్కెట్ అస్థిరతకు సూచికగా భావించే ఇండియా విక్స్ 2 శాతానికి పైగా పడిపోయి 12.30కు చేరుకుంది. దీన్ని మార్కెట్‌లో అస్థిరత తగ్గుతున్న సంకేతంగా భావిస్తారు. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ముఖ్యంగా ఐటీ రంగం ముందంజలో నిలిచింది. ఇన్ఫోసిస్ 3 శాతానికి పైగా ఎగబాకగా, లార్సెన్ అండ్ టూబ్రో, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 1.5 నుంచి 3 శాతం వరకు పెరిగాయి. టెక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్‌టెక్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా లాభాల్లో కొనసాగాయి. అలాగే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), బీఈఎల్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ట్రెంట్ షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో 1 శాతం వరకు నష్టపోయాయి.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచీ 2 శాతానికి పైగా పెరిగి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్, మెటల్, ఆటో రంగాల సూచీలు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. రియాల్టీ సూచీ మాత్రమే నష్టాల్లో కొనసాగింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో చ‌మురు ధ‌ర‌లు బుధ‌వారం భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 3.29 శాతం మేర ఎగ‌బాకి బ్యారెల్‌కు 89 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 3.71 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 82 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మ‌ళ్లీ కాస్త బ‌ల‌ప‌డింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 95.73 వ‌ద్ద ఉన్న రూపాయి సెష‌న్‌లో 10 పైస‌ల‌కు పైగా లాభ‌ప‌డింది.

Advertisement
Advertisement