UNSC | తీవ్ర పరిణామాలు తప్పవు.. ఐరాస వేదికగా పాక్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టిన భారత్
UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్థాన్పై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్ నిరంతరాయంగా టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి దుష్ట శక్తులను భారత్పై ఉసిగొల్పుతోందని ఆరోపించింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు ఇస్లామాబాద్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
International | Published On May 27, 2026, 11.24 am IST
UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్థాన్పై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమ దేశంపై పాకిస్థాన్ కొనసాగిస్తున్న సరిహద్దు దురాక్రమణ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ (Islamabad) సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ధ్వజమెత్తింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు ఇస్లామాబాద్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఐరాస భద్రతా మండలిలో జరిగిన ఓ చర్చ సందర్భంగా పాక్.. జమ్ము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తాత్కాలికంగా నిలిపివేసిన సింధు జలాల ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ భారత్ను విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పాక్ ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా అడ్డుకుంది. వాస్తవాలను ఐరాస వేదికగా ప్రపంచానికి వివరించింది. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఎండగట్టింది.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) మాట్లాడుతూ.. తమపై పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. "ఈ రోజు పాకిస్థాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలు, అనవసరమైన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ వాస్తవాలను స్పష్టం చేయాలనుకుంటోంది. స్వతంత్ర భారతదేశం ప్రారంభం నుంచే పాక్ సరిహద్దు దురాక్రమనను (cross border terrorism) న్యూ ఢిల్లీ ఎదుర్కొంటూ వస్తోంది. దశాబ్దాలుగా ఉగ్రవాదం, మతపరమైన తీవ్రవాదం, హింసాత్మక రాడికలిజానికి పాకిస్థాన్ మద్దతు ఇస్తోంది. మా దేశంలో భాగమైన భూభాగాలను స్వాధీనం చేసుకోవాలని పాక్ ఆశపడుతోంది.
భారత్ను లక్ష్యంగా చేసుకొని యుద్ధాలు, దురాక్రమణలు, ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శాంతియుత సహజీవన సూత్రాలను పదేపదే ఉల్లంఘిస్తోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకొని వెయ్యి గాట్లతో భారతదేశాన్ని రక్తమోడేలా (bleeding India by a thousand cuts) చేయాలన్న పాక్ సిద్ధాంతం.. ఐరాస చార్టర్ పట్ల దానికి ఉన్న నిబద్ధత, డొల్లతనానికి నిదర్శనం" అని హరీశ్ పర్వతనేని ధ్వజమెత్తారు.
పాకిస్థాన్ నిరంతరాయంగా టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి దుష్ట శక్తులను భారత్పై ఉసిగొల్పుతోందని ఆరోపించారు. సరిహద్దు ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు భారత్కు ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాక్ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
Also Read..
బైజూ రవీంద్రన్కు షాక్.. ఆరు నెలల జైలు శిక్ష
అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Iran | చేసేదేం లేక వట్టి చేతుల్తో వెళ్లిపోయారు.. జేడీ వాన్స్పై ఇరాన్ వ్యాఖ్యలు..
ఏప్రిల్ 12, 2026

US-Iran Peace Talks | అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. ఇరాన్కు ఇది చేదు వార్త అన్న జేడీ వాన్స్..
ఏప్రిల్ 12, 2026
తాజావార్తలు
- ●Taiwan Stock Markets | ఢిల్లీ కంటే చిన్న దేశం.. ఇండియాను దాటేసింది..
- ●Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారులు జాగ్రత్త..
- ●Samsung | శాంసంగ్ నుంచి కొత్త ఏఐ టీవీలు.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Byju Raveendran | బైజూ రవీంద్రన్కు షాక్.. ఆరు నెలల జైలు శిక్ష
- ●Stock Markets | స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో సందిగ్ధత..
- ●Road Accident | కంటైనర్ను ఢీకొట్టిన టిప్పర్.. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్

Taiwan Stock Markets | ఢిల్లీ కంటే చిన్న దేశం.. ఇండియాను దాటేసింది..

Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారులు జాగ్రత్త..

Samsung | శాంసంగ్ నుంచి కొత్త ఏఐ టీవీలు.. ఫీచర్లు అదిరిపోయాయి..

Byju Raveendran | బైజూ రవీంద్రన్కు షాక్.. ఆరు నెలల జైలు శిక్ష



