UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
UNSC | భారత్పై బురదజల్లే ప్రయత్నం చేసిన దాయాది పాకిస్థాన్కు భారత్ (India) గట్టిగా సమాధానం ఇచ్చింది. దశాబ్దాలుగా పాక్ సృష్టిస్తున్న నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టింది. నరమేధం సృష్టించిన చరిత్ర ఉన్న దేశం.. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని భారత ప్రతినిధి హరీశ్ పర్వతనేని వ్యాఖ్యానించారు.
International | Published On May 21, 2026, 12.20 pm IST
UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో పాకిస్థాన్కు (Pakistan) మరోసారి భంగపాటు తప్పలేదు. భారత్పై బురదజల్లే ప్రయత్నం చేసిన దాయాదికి భారత్ (India) గట్టిగా సమాధానం ఇచ్చింది. దశాబ్దాలుగా పాక్ సృష్టిస్తున్న నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..? ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో ‘సాయుధ ఘర్షణల్లో పౌరుల రక్షణ’ (Protection of civilians in armed conflict) అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి ఉద్దేశపూర్వకంగానే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అంతర్జాతీయ చట్టాలు, ఉన్నత విలువల గురించి మాట్లాడుతూ భారత్ను విమర్శించే ప్రయత్నం చేశారు. దీన్ని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) గట్టిగా తిప్పికొట్టారు. నరమేధం సృష్టించిన చరిత్ర ఉన్న దేశం.. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఆ దాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదు..
ఈ సందర్భంగా ఆఫ్ఘానిస్థాన్పై పాక్ జరిపిన దాడులను భారత ప్రతినిధి ప్రస్తావించారు. ఈ ఏడాది మార్చిలో పవిత్ర రంజాన్ మాసంలో కాబూల్లోని 'ఓమిడ్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్'పై పాకిస్థాన్ జరిపిన దాడులని ప్రపంచం ఇంకా మర్చిపోలేదన్నారు. వైద్య కేంద్రంపై జరిగిన ఘోరమైన హింసాకాండలో 269 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని.. మరో 122 మంది గాయపడినట్లు చెప్పారు. చీకట్లో అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ.. అంతర్జాతీయ చట్టాల గురించి గొప్పగా మాట్లాడటం పాక్ కపటత్వానికి నిదర్శనమని తీవ్రస్థాయిలో విమర్శించారు.
సొంత ప్రజలపైనే దారుణాలు..
పాక్ సైన్యం గతంలో చేసిన ఘోరాలను ఈ సందర్భంగా భారత్ ప్రపంచం ముందు పెట్టింది. 1971లో ‘ఆపరేషన్ సెర్చ్లైట్’ పేరుతో పాక్ ఆర్మీ సొంత పౌరులపైనే అణచివేతకు పాల్పడిందని గుర్తుచేసింది. సుమారు 4 లక్షల మంది మహిళలపై పాక్ సైనికులు దారుణాలకు ఒడిగట్టారని తెలిపింది. ఓ క్రమపద్ధతిలో సాగించిన సామూహిక అత్యాచారాల ప్రచారాన్ని ఆ దేశమే ఒప్పుకుందని పర్వతనేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంత ప్రజలపైనే బాంబులు వేస్తూ.. ఓ పద్ధతి ప్రకారం మారణహోమాలకు పాల్పడే దేశం ఇలాంటి దురాక్రమణ చర్యలు పాల్పడంలో ఆశ్చర్యకరం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
Also Read..
విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
ఎబోలా విజృంభణ.. అంతర్జాతీయ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేసిన ఢిల్లీ ఎయిర్పోర్టు
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 'మెలోడీ' రీల్.. 24 గంటల్లోనే..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..
- ●Mahesh Kumar Goud | హరీశ్రావు మా పార్టీలోకి వస్తానంటే చర్చిస్తాం : మహేశ్ కుమార్ గౌడ్
- ●Rajpal Yadav | చెక్బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష
- ●Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
- ●Lenin Review | లెనిన్ రివ్యూ - అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే బోణీ కొట్టారా? లేదా?
- ●MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..

Mahesh Kumar Goud | హరీశ్రావు మా పార్టీలోకి వస్తానంటే చర్చిస్తాం : మహేశ్ కుమార్ గౌడ్

Rajpal Yadav | చెక్బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష

Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర






