త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Coal Mine Blast | బొగ్గు గ‌నిలో భారీ పేలుడు.. 34 మంది మృతి

Coal Mine Blast | పాకిస్థాన్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌లూచిస్థాన్ ప్రావిన్స్‌ (Balochistan province)లోని ఓ బొగ్గు గ‌నిలో భారీ పేలుడు (Coal Mine Blast) సంభ‌వించింది.

D

International | Published On Jul 31, 2026, 12.34 pm IST

Coal Mine Blast | బొగ్గు గ‌నిలో భారీ పేలుడు.. 34 మంది మృతి
Advertisement

Coal Mine Blast | పాకిస్థాన్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌లూచిస్థాన్ ప్రావిన్స్‌ (Balochistan province)లోని ఓ బొగ్గు గ‌నిలో భారీ పేలుడు (Coal Mine Blast) సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌దుల సంఖ్య‌లో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు అందులో చిక్కుకుపోయారు.

స్థానిక అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బలూచ్‌ రాజధాని క్వెట్టా (Quetta) సమీపంలోని ఒక గనిలో గురువారం ఈ పేలుడు సంభవించింది. స‌మాచారం అందుకున్న అధికారులు అక్క‌డికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌మాద స‌మ‌యంలో గ‌నిలో 36 మంది కార్మికులు ప‌ని చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ 34 మంది మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. మిగ‌తా వారి కోసం గాలింపు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. పేలుడు ధాటికి స‌మీపంలోని మ‌రో రెండు బొగ్గు గ‌నులు కూడా దెబ్బ‌తిన్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. గ‌నిలో మీథేన్ వాయువు భారీగా పేరుకుపోవ‌డంతోనే ఈ ప్ర‌మాదం సంభ‌వించి ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

బెదిరింపుల‌తో జెన్ జీ నోరు నొక్కేయ‌లేరు.. మోదీ, షాపై రాహుల్ విమ‌ర్శ‌లు

ప్ర‌ధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు న‌మోదు

కాంగ్రెస్‌కు కొత్త స‌మ‌స్య‌.. అసెంబ్లీలో మాజీ సీఎంకు సీటు ఎక్క‌డ?

Advertisement
Advertisement