త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. కీల‌క వ‌డ్డీ రేట్లు మూడోసారీ య‌థాత‌థం

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను (Repo Rate) మ‌రోసారి యథాతథంగా 5.25 శాతం వద్దే ఉంచింది.

D

Business | Published On Jun 5, 2026, 11.03 am IST

RBI | లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. కీల‌క వ‌డ్డీ రేట్లు మూడోసారీ య‌థాత‌థం
Advertisement

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను (Repo Rate) మ‌రోసారి యథాతథంగా 5.25 శాతం వద్దే ఉంచింది. ఈ మేర‌కు ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌లో తీసుకున్న నిర్ణ‌యాల‌ను శుక్ర‌వారం ఉద‌యం ఆర్బీఐ గ‌ర‌వ్న‌ర్ (RBI Governor) సంజ‌య్ మ‌ల్హోత్ర (Sanjay Malhotra) మీడియాకు వెల్ల‌డించారు. వ‌రుస‌గా మూడోసారి రెపోరేటు (repo rate)లో ఎలాంటి మార్పూ లేద‌ని ప్ర‌క‌టించారు. అదేవిధంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. జీడీపీ వృద్ధి అంచనాను 69.9 నుంచి 6.6 శాతానికి తగ్గించారు.

కాగా, గ‌తేడాది వ‌డ్డీరేట్ల‌ను ఆర్బీఐ ప‌లుమార్లు స‌వ‌రించిన విష‌యం తెలిసిందే. గ‌తేడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. జూన్‌ సమీక్షలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్‌లో పావు శాతం త‌గ్గించ‌డంతో వ‌డ్డీరేటు 5.25 శాతానికి చేరింది. ఇక ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి, ఏప్రిల్ నెల‌ల్లో జ‌రిగిన స‌మీక్ష‌ల్లో వ‌డ్డీరేట్ల‌లో ఎలాంటి మార్పులూ చేయ‌లేదు. అయితే, ఈసారి గ్లోబ‌ల్ క్రైసిస్ (US-Iran War) కార‌ణంగా వ‌డ్డీ రేట్లు పెరుగుతాయ‌ని అంతా భావించారు. కానీ ఆర్బీఐ మాత్రం వ‌రుస‌గా మూడోసారి కూడా 5.25 శాతం వ‌ద్దే కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంతో హోల్‌లోన్స్‌, ప‌ర్స‌న‌ల్ లోన్స్ తీసుకున్న వారికి ఊర‌ట ల‌భించ‌నుంది.

Also Read..

నీటిని ఆదా చేయండి.. భ‌విష్య‌త్తులో వ‌ర్షాలు రాకుండా ఉండే ప‌రిస్థితి వ‌స్తుంది: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

భారీగా ప‌త‌న‌మైన స్టాక్ మార్కెట్లు.. స్వ‌ల్పంగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

మే నెల‌లో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న 25 ల‌క్ష‌ల మందికిపైగా భ‌క్తులు.. హుండీ ఆదాయం ఎంతంటే?

Advertisement
Advertisement