త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | వాతావ‌ర‌ణ మార్పుల‌ను త‌ట్టుకునే న‌గ‌రాన్ని నిర్మిద్దాం: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ పిలుపు

Ponnam Prabhakar | భావి త‌రాల కోసం స్వ‌చ్ఛ‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన, వాతావ‌ర‌ణ మార్పుల‌ను త‌ట్టుకొనే న‌గ‌రాన్ని నిర్మిద్దామిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు. యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్కులో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మొక్క‌లు నాటి నీళ్లు పోశారు.

S

Hyderabad | Published On Jun 5, 2026, 1.17 pm IST

Ponnam Prabhakar | వాతావ‌ర‌ణ మార్పుల‌ను త‌ట్టుకునే న‌గ‌రాన్ని నిర్మిద్దాం: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ పిలుపు
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: భావి త‌రాల కోసం స్వ‌చ్ఛ‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన, వాతావ‌ర‌ణ మార్పుల‌ను త‌ట్టుకొనే న‌గ‌రాన్ని నిర్మిద్దామిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్ర‌వారం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్కులో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మొక్క‌లు నాటి నీళ్లు పోశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.

మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు, సుస్థిర అభివృద్ధి కోసం పాటుప‌డాల్సిన విష‌యాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుత, భావి తరాల వాతావరణ మార్పులను తట్టుకునే నగరాన్ని నిర్మించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు. హైదరాబాద్ వంటి న‌గ‌రాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం ఎంతో కీలకమ‌ని చెప్పారు. మొక్క‌ల సంర‌క్ష‌ణ‌లో త‌మ వంతు పాత్ర నిర్వ‌హిస్తామ‌న్నారు. అనంత‌రం ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులతో క‌లిసి మంత్రి గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌రించి ప్ర‌తిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జీహెచ్‌హెంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement