Toll Booths | టోల్ప్లాజాలా వద్ద “నో క్యాష్”.. ఇకపై మొత్తం డిజిటల్ ప్రయాణమే.. ఎప్పటి నుంచంటే..?
Toll Booths | జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు కీలక అలర్ట్. టోల్ రుసుముల చెల్లింపులకు (Toll Charges) సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Toll Booths | జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు కీలక అలర్ట్. టోల్ రుసుముల చెల్లింపులకు (Toll Charges) సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు ఉండవు. ఫాస్టాగ్ లేని వాహనాలకు డిజిటల్ లావాదేవీలను (Digital Payments) మాత్రమే అనుమతించనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. టోల్ ప్లాజాల వద్ద నగదు స్వీకరించే కౌంటర్లు పూర్తిగా మూసివేయనున్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. వాహనదారులు టోల్ రుసుమును కేవలం డిజిటల్ పద్ధతుల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ (FASTag) లేకపోతే, యూపీఐ (UPI) ద్వారా చెల్లించొచ్చు. అయితే, సాధారణ రుసుము కంటే 25 శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎన్హెచ్ టోల్ప్లాజాల్లో దాదాపు 98 శాతం చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగదు లావాదేవీలను నిలిపివేస్తూ ఎన్హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాలా వద్ద ఇకపై ఆగాల్సిన అవసరం ఉండదు.
ఐడీ కార్డ్ మినహాయింపు విధానానికి స్వస్తి
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టోల్ మినహాయింపు కోసం తమ గుర్తింపు కార్డులను (ఐడీ కార్డులు) చూపించే విధానానికి కూడా ప్రభుత్వం స్వస్తి పలికింది. టోల్ మినహాయింపు పరిధిలోకి వచ్చే ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు ఇకపై తమ వాహనాలకు తప్పనిసరిగా 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' తీసుకోవాలి. ఈ ప్రత్యేక ఫాస్టాగ్ లేని వాహనాలు తప్పనిసరిగా టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు
మరోవైపు ఫాస్టాగ్ ఇయర్ పాస్ ధరలను కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పెంచింది. ఇప్పటి వరకూ రూ.3,000గా ఉన్న ఇయర్ పాస్పై 2.5 శాతం మేర పెంచింది (FASTag Annual Pass Fee Hiked). ఎన్హెచ్ఏఐ నిర్ణయంతో ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ.3.075కు చేరింది. కొత్త ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.
Also Read..
కొలెస్ట్రాల్ టెస్టులకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త మార్గదర్శకాలు
లాసెట్ దరఖాస్తు గడువు పెంపు.. 10 వరకు ఆన్లైన్ అప్లికేషన్లు
రైతుల భవిష్యత్ కావాల్నా.. దళారుల కమీషన్ కావాల్నా?: హరీశ్రావు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






