UPI transactions | మే నెలలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
UPI transactions | దేశంలో డిజిటిల్ చెల్లింపులు (UPI transactions) చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (digital payment transactions) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
UPI transactions | దేశంలో డిజిటిల్ చెల్లింపులు (UPI transactions) చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (digital payment transactions) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మే నెలలో యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. మేలో యూపీఐ లావాదేవీల పరిణామం ఏడాది ప్రాతిపదికన 24 శాతం పెరిగి 23.20 బిలియన్లకు చేరుకుంది. ఆ లావాదేవీల మొత్తం విలువ దాదాపు రూ. 30 లక్షల కోట్ల మార్కును తాకింది.
ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సోమవారం వెల్లడించింది. మే నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 29.90 లక్షల కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే (year-on-year) లావాదేవీల విలువ 19 శాతం పెరిగినట్లు చెప్పింది. మే నెలలో సగటున రోజుకు సుమారు 748 మిలియన్ల లావాదేవీలు జరిగాయని, వాటి సగటు విలువ రోజుకు సుమారు రూ.96,465 కోట్లుగా ఉందని ఎన్పీసీఐ వివరించింది.
గత నెలలో (ఏప్రిల్) కూడా డిజిటల్ చెల్లింపులు ఏడాది ప్రాతిపదికన (year-on-year) 25 శాతం వృద్ధితో 22.35 బిలియన్ల లావాదేవీలను నమోదు చేశాయి. వాటి విలువ రూ.29.03 లక్షల కోట్లుగా ఉంది. రోజువారీ ప్రాతిపదికన, సగటు లావాదేవీల సంఖ్య ఏప్రిల్ నెలలో గణనీయంగా పెరిగి 745 మిలియన్లకు చేరింది. అంతకు ముందు నెల అంటే మార్చిలో లావాదేవీల సంఖ్య 730 మిలియన్లుగా ఉంది. ఇక మే నెలలో యూపీఐతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులైన ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీలు 358 మిలియన్లుగా, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా 88 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదికిపైగా దేశాల్లో..
భారత్ వెలుపలా యూపీఐ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం ఎనిమిదికిపైగా దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, ఖతార్, సింగపూర్, శ్రీలంక, యూఏఈల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. యూపీఐని అంతర్జాతీయంగా విస్తరించేందుకు ప్రభుత్వం, రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత దశాబ్ద కాలంలో యూపీఐ లావాదేవీల సంఖ్యలో ఏకంగా 12,000 రెట్ల అసాధారణ వృద్ధి నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 కోట్లుగా ఉన్న లావాదేవీలు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 24,162 కోట్లకు పైగా పెరగడం విశేషం. 2025-26 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
Also Read..
ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక.. కాళేశ్వరం: మంత్రి వివేక్
అట్టుడుకుతున్న తెలంగాణ.. మరో వారం రోజులు మండుటెండలే..!
తెలంగాణలో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు: రాంచందర్ రావు
తాజావార్తలు
- ●AePS | ఆధార్ నంబర్తో నగదు విత్డ్రా.. AePS అంటే ఏమిటి?
- ●CDAC Recruitment | సీడాక్లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు
- ●Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
- ●Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
- ●Cabinet Expands | బెంగాల్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం
- ●Mahalakshmi Smart Card | ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొందడం ఎలా..?

AePS | ఆధార్ నంబర్తో నగదు విత్డ్రా.. AePS అంటే ఏమిటి?

CDAC Recruitment | సీడాక్లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు

Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్

Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ





