త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Jupally Krishna Rao | తెలంగాణ నీటి కేటాయింపుల్లో రాజీ ప‌డం: మంత్రి జూపల్లి

Minister Jupally Krishna Rao | నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం(Srishailam)లో ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి (Power production) చేస్తోందని, తాము హెచ్చ‌రించ‌డంతోనే ఉత్ప‌త్తిని నిలిపి వేసింద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. తెలంగాణ నీటి కేటాయింపుల్లో రాజీ ప‌డ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Mar 31, 2026, 1.30 pm IST

Minister Jupally Krishna Rao | తెలంగాణ నీటి కేటాయింపుల్లో రాజీ ప‌డం: మంత్రి జూపల్లి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం(Srishailam)లో ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి (Power production) చేస్తోందని, తాము హెచ్చ‌రించ‌డంతోనే ఉత్ప‌త్తిని నిలిపి వేసింద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. తెలంగాణ నీటి కేటాయింపుల్లో రాజీ ప‌డ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ లో కనిష్ట నీటి మట్టం స్థాయి 834 అడుగుల (254.2 మీటర్లు)కు చేరుకున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయొద్ద‌నే నిబంధన ఉందన్నారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాల‌ను పట్టించుకోకుండా ఏపీ సర్కార్ అక్రమంగా, అన్యాయంగా నీటిని తోడేస్తుంద‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

మా హెచ్చ‌రిక‌ల‌తోనే ఏపీ వెన‌క్కి..

విద్యుత్తు ఉత్ప‌త్తి అంశంపై ఎన్నిసార్లు విన్నవించినా ఏపీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. అందుకే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం, కృష్ణా పరీవాహక ప్రాంత జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులం శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చామ‌ని, మా హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసిందని చెప్పారు.

రైతు ప‌క్షాన నిల‌బ‌డ‌తం..

ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమ‌న్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులం సిద్ధంగా ఉన్నాం. పాలమూరు జిల్లాకు నష్టం జరిగితే రైతు పక్షాన ప్రభుత్వం పోరాడుతుంద‌ని, ఈ సంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకొనేది లేదన్నారు.

ఏపీ ప్రభుత్వం భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నామ‌ని పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్రంలో ఇలాగే వ్యవహరిస్తే ఆందోళన చేపట్టామ‌ని, హై కోర్టును కూడా ఆశ్ర‌యించినట్లు గుర్తు చేశారు. అప్పుడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమ‌ని జూప‌ల్లి స్ప‌ష్టం చేశారు.

Also Read..

CID Notice to Koushik Reddy | పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. ఏప్రిల్ 4న విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశం

Paadi Koushik Reddy | ఎన్ని నోటీసులిచ్చినా వెన‌క్కి త‌గ్గ‌ను: పాడి కౌశిక్ రెడ్డి

Masood Azhar | జైషే చీఫ్ మ‌సూద్ అజార్ సోద‌రుడు మృతి..!

Advertisement

తాజావార్తలు

Advertisement