త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Masood Azhar | జైషే చీఫ్ మ‌సూద్ అజార్ సోద‌రుడు మృతి..!

Masood Azhar | నిషేధిత ఉగ్ర‌సంస్థ‌ జైషే మొహ‌మ్మ‌ద్ చీఫ్ (Jaish chief) మౌలానా మ‌సూద్ అజార్ (Maulana Masood Azhar) సోద‌రుడు మొహ‌మ్మ‌ద్ తాహిర్ అన్వ‌ర్ (Mohammad Tahir Anwar) మృతిచెందాడు.

D

International | Published On Mar 31, 2026, 12.42 pm IST

Masood Azhar | జైషే చీఫ్ మ‌సూద్ అజార్ సోద‌రుడు మృతి..!
Advertisement

Masood Azhar | నిషేధిత ఉగ్ర‌సంస్థ‌ జైషే మొహ‌మ్మ‌ద్ చీఫ్ (Jaish chief) మౌలానా మ‌సూద్ అజార్ (Maulana Masood Azhar) సోద‌రుడు మొహ‌మ్మ‌ద్ తాహిర్ అన్వ‌ర్ (Mohammad Tahir Anwar) మృతిచెందాడు. పాకిస్థాన్ (Pakistan)లో అనుమానాస్ప‌ద రీతిలో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. ఆయ‌న మృతికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. బహావల్‌పూర్ (Bahawalpur) లోని జామియా మసీదు ఉస్మాన్ వాలిలో అన్వ‌ర్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. మ‌హ‌మ్మ‌ద్ తాహిర్ జైషే కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.

కాగా, జైషే చీఫ్ మ‌సూద్ అజార్ గ‌తేడాది కూడా దాదాపు ప‌ది మంది కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఆప‌రేష‌న్ సిందూర్‌లో భాగంగా బహావల్‌పూర్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై మ‌న సైన్యం చేసిన దాడుల్లో అజార్‌కు అత్యంత సన్నిహితులైన పలువురు బంధువులు చనిపోయారు. అజార్ సోద‌రి, ఆమె భ‌ర్త, మేన‌ల్లుడు, అత‌ని భార్య‌, మేన‌కోడ‌లుతో పాటు ప‌లువురు కుటుంబ‌స‌భ్యులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది సెప్టెంబర్‌లో జైష్ సంస్థ మొదటిసారిగా ఈ నష్టాలను పరోక్షంగా అంగీకరించింది కూడా.

ఇక‌ భార‌త్‌లో జ‌రిగిన అనేక ఉగ్ర దాడుల‌కు ఈ జైషే సంస్థ‌కు సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. 2001 పార్ల‌మెంట్‌పై దాడి, 2008 ముంబై దాడులు, 2016 ప‌ఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడిలో మ‌సూద్ నిందితుడిగా ఉన్నాడు. ఇక మ‌సూద్ అజార్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Also Read..

హ‌ర్మూజ్‌ను తెర‌వ‌క‌పోయినా.. యుద్ధాన్ని ఆపేస్తాం : డొనాల్డ్ ట్రంప్‌

ఆల‌యంలో తొక్కిస‌లాట‌.. 8 మంది భ‌క్తులు మృతి

ఇరాన్ నుంచి భార‌త్‌కు వ‌చ్చే విమానంపై అమెరికా దాడి

Advertisement

తాజావార్తలు

Advertisement