త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మంట‌పెట్టి వండుకోండి.. గ్యాస్ కొర‌త‌పై సీఎం రేవంత్ కీల‌క‌ వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | గ్యాస్ కొర‌త‌పై (gas crisis) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గ్యాస్ దొర‌క‌క‌పోతే పూర్వ‌కాలంలో లాగా రాళ్ల‌ను కొట్టి మంట‌పెట్టి వంట వండుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

D

Telangana | Published On Mar 25, 2026, 2.56 pm IST

CM Revanth Reddy | మంట‌పెట్టి వండుకోండి.. గ్యాస్ కొర‌త‌పై సీఎం రేవంత్ కీల‌క‌ వ్యాఖ్య‌లు
Advertisement

CM Revanth Reddy | ఇరాన్ యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంధ‌న కొర‌త ఏర్ప‌డింది. పెట్రోల్‌, గ్యాస్‌, ఎల్పీజీ దొర‌క‌ద‌న్న భ‌యంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో గ్యాస్ కొర‌త‌పై (gas crisis) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రేవంత్‌కు దేశంలో గ్యాస్ కొరత మీద స్పంద‌నేంటి అన్న ప్ర‌శ్న ఎదురైంది. ఈ సంద‌ర్భంగా సీఎం స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముందుగా సూర్య భ‌గ‌వానుడిని ప్రార్థించి.. ఇతిహాస కాలంలోలాగా రాళ్ల‌ను కొట్టి మంట పుట్టిచ్చి వంట వండుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

https://x.com/Vaartha_Hindi/status/2036690301264507005

నెటిజ‌న్లు ఫైర్‌..

ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నిద్దాం అని చెప్పాలి. అవసరమైతే ఇండక్షన్ స్ట‌వ్స్, ఎలక్ట్రిక్ కుకర్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించండని చెప్పాల్సిన‌ సీఎం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇస్తే ట్రోల్స్ త‌ప్ప ఏమీ రాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read..

వందేమాత‌రం ఆల‌పిస్తుండ‌గా వాకౌట్‌.. ఎంఐఎం ఎమ్మెల్యేల శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి : బీజేపీ

ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ వ్య‌వ‌ధిని 35 రోజుల‌కు పెంచారంటూ వార్త‌లు.. కేంద్రం క్లారిటీ

ఈసారైనా ఇందిర‌మ్మ ఇండ్ల‌పై సమీక్ష నిర్వ‌హించండి.. మంత్రి పొంగులేటిపై స్పీక‌ర్ ఆగ్ర‌హం

Advertisement

తాజావార్తలు

Advertisement