త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | ఈసారైనా ఇందిర‌మ్మ ఇండ్ల‌పై సమీక్ష నిర్వ‌హించండి.. మంత్రి పొంగులేటిపై స్పీక‌ర్ ఆగ్ర‌హం

Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై (Ponguleti Srinivas Reddy) స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అసెంబ్లీ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసారైనా ఇందిర‌మ్మ ఇండ్ల‌పై విప‌క్షాల‌తో స‌మావేశం నిర్వ‌హించాల‌ని సూచించారు.

G

Telangana | Published On Mar 25, 2026, 1.16 pm IST

Ponguleti Srinivas Reddy | ఈసారైనా ఇందిర‌మ్మ ఇండ్ల‌పై సమీక్ష నిర్వ‌హించండి.. మంత్రి పొంగులేటిపై స్పీక‌ర్ ఆగ్ర‌హం
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై (Ponguleti Srinivas Reddy) స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అసెంబ్లీ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసారైనా ఇందిర‌మ్మ ఇండ్ల‌పై విప‌క్షాల‌తో స‌మావేశం నిర్వ‌హించాల‌ని సూచించారు. తాను గ‌తంలోనే ఇందిర‌మ్మ ఇండ్ల పురోగ‌తిపై స‌మీక్ష నిర్వ‌హించాల‌ని చెప్పిన‌ట్లు గుర్తుచేశారు. త‌న సూచ‌న‌ల‌ను మంత్రి పొంగులేటి ప‌ట్టించుకోలేద‌న్నారు. త‌న సూచ‌న‌లు పాటించి స‌మీక్షించి ఉంటే ఇన్ని ప్ర‌శ్న‌లు వ‌చ్చేవి కాద‌న్నారు.

ఇందిర‌మ్మ ఇండ్ల‌పై శాస‌న స‌భ్యుల ప్ర‌శ్న‌ల నేప‌థ్యంలో స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ మాట్లాడుతూ.. స‌భ‌లో ఉన్న స‌భ్యులంద‌రు అధికార ప‌క్షం కానీ, విప‌క్షాలు కానీ.. ఈ ప్ర‌శ్న అడ‌గాల‌నుకుంటున్నారు. మీకు ఇంత‌కుముందు సెష‌న్‌లో కూడా చెప్పాను.. అంద‌రిని పిలిచి అసెంబ్లీలో స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని. అలా చేసి ఉంటే ఈ అవ‌కాశం దొర‌కుండే. ఈసారైనా అసెంబ్లీ కాగానే అంద‌రినీ పిలిచి ఒక రివ్యూ మీటింగ్ త‌ప్ప‌నిస‌రిగా పెట్టాల‌ని సూచిస్తున్నా` అని మంత్రి పొంగులేటిని ఉద్దేశించి అన్నారు.

https://x.com/TeluguScribe/status/2036677536848212403

Advertisement

తాజావార్తలు

Advertisement