త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | పేప‌ర్‌లెస్‌గా మంత్రివ‌ర్గ స‌మావేశాలు.. డిజిట‌ల్ క్యాబినెట్ నిర్వ‌హ‌ణ‌కు ఆమోదం

Revanth Reddy | రాష్ట్రంలో ఇక‌నుంచి మంత్రివర్గ సమావేశాలను కాగితరహితంగా, డిజిటల్​గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం స‌చివాల‌యంలో జరుగుతున్న మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు.

S

Telangana | Published On Jun 18, 2026, 1.38 pm IST

Revanth Reddy | పేప‌ర్‌లెస్‌గా మంత్రివ‌ర్గ స‌మావేశాలు.. డిజిట‌ల్ క్యాబినెట్ నిర్వ‌హ‌ణ‌కు ఆమోదం
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఇక‌నుంచి మంత్రివర్గ సమావేశాలను కాగితరహితంగా, డిజిటల్​గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం స‌చివాల‌యంలో జరుగుతున్న మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ట్యాబ్‌లు అందజేశారు. ఈ- బుక్ ద్వారానే మంత్రులకు మంత్రివర్గ సమావేశం అజెండా అంశాలు పంపనున్నారు.

అనంత‌రం డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. పేపర్ లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ క్యాక్ర‌మాలు నిర్వ‌హించనున్నారు. ఈ అనధికార‌ మంత్రివర్గ స‌మావేశంలో ప‌లు అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు చర్చిస్తున్నారు.

Advertisement
Advertisement