త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire At Multi Storey Building | ఘోర అగ్నిప్ర‌మాదం.. ముగ్గురు చిన్నారులు స‌హా తొమ్మిది మంది మృతి

Fire At Multi Storey Building | ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. పాలం (Palam) ప్రాంతంలో ఓ భ‌వ‌నంలో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి.

D

National | Published On Mar 18, 2026, 12.31 pm IST

Fire At Multi Storey Building | ఘోర అగ్నిప్ర‌మాదం.. ముగ్గురు చిన్నారులు స‌హా తొమ్మిది మంది మృతి
Advertisement

Fire At Multi Storey Building | ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. పాలం (Palam) ప్రాంతంలో ఓ భ‌వ‌నంలో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు చిన్నారులు స‌హా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పాలం మెట్రో స్టేష‌న్ స‌మీపంలోని బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలో బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల ప్రాంతంలో ఈ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది (Fire At Multi Storey Building). క్ష‌ణాల్లోనే మంట‌ల తీవ్రత పెరిగింది. ఆ ప్రాంతంలో ద‌ట్టంగా పొగ క‌మ్మేసింది. ఈ ఘ‌ట‌న‌తో భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికులు వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు.

https://x.com/PTI_News/status/2034127539275502030

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క ద‌ళం 30 ఫైర్ ఇంజ‌న్ల‌తో మంట‌లు అదుపుచేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. బిల్డింగ్‌లోని నివాసితుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో ఓ ఇంట్లోని ముగ్గ‌రు పిల్ల‌లు స‌హా ఏడుగురిని ర‌క్షించి స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అక్క‌డ వారు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో మొత్తం తొమ్మిది మంది మ‌ర‌ణించారు. ఇక ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో భ‌వ‌నంపై నుంచి దూకి మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై విచార‌ణ చేస్తున్నారు.

https://x.com/PTI_News/status/2034132780024844768

Also Read..

ఇండోర్‌లో దారుణం.. ఎల‌క్ట్రిక్ వాహ‌నం ఛార్జింగ్ పాయింట్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

బ‌డ్జెట్ స‌మావేశాల వేళ‌.. అసెంబ్లీకి బాంబు బెదిరింపులు

విమాన ప్ర‌యాణికుల‌కు కేంద్రం భారీ ఊర‌ట‌.. సీట్ల దోపిడీకి చెక్

Advertisement

తాజావార్తలు

Advertisement