త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Longest Non-Stop Train | దేశంలో ఒక్క‌చోట కూడా ఆగ‌కుండా అత్య‌ధిక దూరం ప్ర‌యాణించే రైలు ఏది?

Longest Non-Stop Train | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌తీయ రైల్వే (Indian Railways) ఎన్నో విశిష్ట‌త‌ల‌కు నెల‌వు. త‌మ వేగంతో కొన్ని రైళ్లు, స‌దుపాయాల‌తో మ‌రికొన్ని, దేశంలోని మారుమూల ప్రాంతాల‌ను అనుసంధానిస్తూ ఇంకొన్ని రైళ్లు త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాయి. కానీ, ఒక రైలు మాత్రం ఒక్క చోట కూడా ఆగ‌కుండా అత్య‌ధిక దూరం (Longest Non-Stop Train) ప్ర‌యాణిస్తూ గుర్తింపును తెచ్చుకున్న‌ది.

G

National | Published On May 17, 2026, 11.08 am IST

Longest Non-Stop Train | దేశంలో ఒక్క‌చోట కూడా ఆగ‌కుండా అత్య‌ధిక దూరం ప్ర‌యాణించే రైలు ఏది?
Advertisement

Longest Non-Stop Train | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌తీయ రైల్వే (Indian Railways) ఎన్నో విశిష్ట‌త‌ల‌కు నెల‌వు. ప్ర‌పంచంలోనే అత్యధిక రైల్వే నెట్‌వ‌ర్క్ క‌లిగిన వ్య‌వ‌స్థ‌గా, ఎక్కువ మంది ఉద్యోగులు క‌లిసిన సంస్థ‌గా, త‌క్కువ ధ‌ర‌కే సేవ‌లు అందిస్తూ సామాన్య ప్ర‌జ‌లకు చేరువైంది. ప్ర‌తిరోజూ 2.3 కోట్ల‌కు పైగా ప్ర‌యాణికుల‌ను, 30 ల‌క్ష‌ల ట‌న్నుల స‌రుకును భార‌తీయ రైల్వే చేర‌వేస్తున్న‌ది. రాజ‌ధాని (Rajdhani Express), శ‌తాబ్ధి, దురంతో, వందే భార‌త్, మ‌హారాజా ఎక్స్‌ప్రెస్‌, ప్యాలెస్ ఆన్ వీల్స్ వంటి విలాస‌వంత‌మైన రైళ్లు ప్ర‌యాణ అనుభ‌వాన్ని అందిస్తున్నది. అత్యంత స‌ర‌స‌మైన ర‌వాణా సాధ‌నాల్లో ఒక‌టిగా, అన్ని వ‌ర్గాల వారికీ అందుబాటులో ఉంది. విభిన్న సంస్కృతులు, భాష‌లు, భౌగోళిక ప్రాంతాల‌ను ఒక‌దానితో ఒక‌టి క‌లుపుతూ, దేశ ఐక్య‌త‌కు చిహ్నంగా నిలుస్తున్నది. త‌మ వేగంతో కొన్ని రైళ్లు, స‌దుపాయాల‌తో మ‌రికొన్ని, దేశంలోని మారుమూల ప్రాంతాల‌ను అనుసంధానిస్తూ ఇంకొన్ని రైళ్లు త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాయి. కానీ, ఒక రైలు మాత్రం ఒక్క చోట కూడా ఆగ‌కుండా అత్య‌ధిక దూరం (Longest Non-Stop Train) ప్ర‌యాణిస్తూ గుర్తింపును తెచ్చుకున్న‌ది. అదే తిరువ‌నంత‌పురం-హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌ (Trivandrum-Hazrat Nizamuddin).

3 వేల కి.మీ.. 3 రోజుల ప్ర‌యాణం..

కేర‌ళ క్యాపిట‌ల్ తిరువ‌నంత‌పురం (Thiruvananthapuram), దేశ రాజ‌ధాని ఢిల్లీని (Delhi) క‌లుపుతూ సుమారు 3149 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ఇది త‌న గ‌మ్య‌స్థానాన్ని చేర‌డానికి 3 రోజులు ప‌డుతుంది. ఈ రైలు ఒక్క చోట కూడా ఆగ‌కుండా ఏక‌బిగిన‌ 528 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. తన ప్రయాణ మార్గంలో రాజస్థాన్‌లోని కోటా (Kota) నుంచి గుజరాత్‌లోని వడోదర (Vadodara) మధ్య ఎక్క‌డా ఆగకుండా దూసుకెళ్తుంది. ఈ దూరాన్ని చేర‌డానికి ఈ రైలుకు సుమారు 6.30 నుంచి 7 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. త‌ద్వారా దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన నిరంతరాయ రైల్వే మార్గాలలో ఒకటిగా నిలిచింది.

రాజధాని ఎక్స్‌ప్రెస్..

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు దేశ రాజ‌ధాని ఢిల్లీని వివిధ రాష్ట్రాల రాజ‌ధానుల‌తో లేదా రాష్ట్రాన్ని పెద్ద న‌గ‌రాల‌తో క‌లుపుతుంది. పూర్తిగా ఏసీ బోగీలు క‌లిగిన ఈ ప్రీమియం రైలుకు భార‌తీయ రైల్వే నెట్‌వ‌ర్కులో అత్య‌ధిక ప్రాధాన్యం ఉంటుంది. 1969 మార్చి 1న తొలి రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌ను న్యూఢిల్లీ-హౌరా మ‌ధ్య ప్రారంభ‌మైంది. ఈ రెండు స్టేష‌న్ల మ‌ధ్య 1451 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవ‌లం 17.20 గంట‌ల్లోనే చేరుకున్న‌ది. ఆ త‌ర్వాత 1972లో ముంబై సెంట్ర‌ల్‌-ఢిల్లీ మ‌ధ్య రెండో రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 1992 వ‌ర‌కు దేశంలో ఈ రెండు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైట్లు మాత్ర‌మే ఉండేవి. ఆ త‌ర్వాత ట్రాక్‌ల అభివృద్ధితో క్ర‌మంగా అన్ని రాష్ట్రాల రాజ‌ధానులు లేదా పెద్ద న‌గ‌రాల‌కు ఈ ప్రీమియం స‌ర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం దేశంలో 24 జ‌త‌ల రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు న‌డుస్తున్నాయి.

Advertisement
Advertisement