Fire Accident | ఇండోర్లో దారుణం.. ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
Fire Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore) నగరంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాలీ స్క్వేర్ సమీపంలోని బ్రిజేశ్వరి అనెక్స్లో మూడంతుస్తుల భవనంలో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు.
Fire Accident | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore) నగరంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాలీ స్క్వేర్ సమీపంలోని బ్రిజేశ్వరి అనెక్స్లో మూడంతుస్తుల భవనంలో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో ప్రాథమికంగా ఛార్జింగ్ పాయింట్లో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. క్రమేణా మంటలు పెరిగి ఇంట్లోకి వ్యాపించాయి. ఇంట్లో దాదాపు పది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉండడంతో వాటిలో కొన్ని పేలిపోయి, పరిస్థితి విషమించింది. భవనంలోని మూడంతుస్తుల్లోనూ ఉంటున్నవారు ప్రమాదం ధాటికి కరెంటు పోవడం, దాని కారణంగా ఎలక్ట్రానిక్ లాకింగ్ విధానంలో ఉన్న తలుపులు తెరుచుకోకపోవడంతో లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. వారిలో చాలామంది పొగ పీల్చి, అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఏడుగురు మృతి చెందగా, వారిని విజయ్ సేథియా (65), చోటూ సేథియా (22), సుమన్ (60), మనోజ్ పుగాలియా (65), సిమ్రాన్ (30), రాశి సేథియా (12), తిను (35)లుగా గుర్తించారు. మరో ముగ్గురు సౌరభ్ పుగాలియా (30), ఆశిష్ (30), హర్షిత్ పుగాలియా (25) తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..






