Fire Accident | ఇండోర్లో దారుణం.. ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
Fire Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore) నగరంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాలీ స్క్వేర్ సమీపంలోని బ్రిజేశ్వరి అనెక్స్లో మూడంతుస్తుల భవనంలో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు.
Fire Accident | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore) నగరంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాలీ స్క్వేర్ సమీపంలోని బ్రిజేశ్వరి అనెక్స్లో మూడంతుస్తుల భవనంలో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో ప్రాథమికంగా ఛార్జింగ్ పాయింట్లో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. క్రమేణా మంటలు పెరిగి ఇంట్లోకి వ్యాపించాయి. ఇంట్లో దాదాపు పది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉండడంతో వాటిలో కొన్ని పేలిపోయి, పరిస్థితి విషమించింది. భవనంలోని మూడంతుస్తుల్లోనూ ఉంటున్నవారు ప్రమాదం ధాటికి కరెంటు పోవడం, దాని కారణంగా ఎలక్ట్రానిక్ లాకింగ్ విధానంలో ఉన్న తలుపులు తెరుచుకోకపోవడంతో లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. వారిలో చాలామంది పొగ పీల్చి, అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఏడుగురు మృతి చెందగా, వారిని విజయ్ సేథియా (65), చోటూ సేథియా (22), సుమన్ (60), మనోజ్ పుగాలియా (65), సిమ్రాన్ (30), రాశి సేథియా (12), తిను (35)లుగా గుర్తించారు. మరో ముగ్గురు సౌరభ్ పుగాలియా (30), ఆశిష్ (30), హర్షిత్ పుగాలియా (25) తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






