త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha Elections | మోగిన ఎన్నిక‌ల న‌గారా.. 24 రాజ్యసభ స్థానాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

Rajya Sabha Elections | దేశంలో మ‌రోసారి ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల (Rajya Sabha seats) భర్తీకి ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

D

National | Published On Jun 1, 2026, 1.03 pm IST

Rajya Sabha Elections | మోగిన ఎన్నిక‌ల న‌గారా.. 24 రాజ్యసభ స్థానాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
Advertisement

Rajya Sabha Elections | దేశంలో మ‌రోసారి ఎన్నిక‌ల న‌గారా మోగింది. ప‌లు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల (Rajya Sabha seats) భర్తీకి ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్న‌ట్లు తెలిపింది. జూన్‌ 9న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణ జూన్‌ 11 వరకు గ‌డువు ఇచ్చింది.

జూన్ 18న ఎన్నిక‌లు (Rajya Sabha Elections) నిర్వ‌హించ‌నుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాల్లో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలు, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు, మ‌ణిపూర్‌, మేఘాల‌యా, మిజోరాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఒక్కోస్థానానికి.. మొత్తం 24 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.

Also Read..

బెంగాల్ కేబినెట్ విస్త‌ర‌ణ‌.. మంత్రులుగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్ర‌మాణం

కేంద్ర విద్యాశాఖ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

మే నెల‌లో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు

Advertisement
Advertisement